#


Index

  ఇదీ ఒక దైవ చేష్టితమే నని నిర్లిప్తతతో బయలు దేరి బృందావనం చేరుతాడు. రామకృష్ణులను దర్శించి రాజాదేశ మందిస్తే మందహాసం చేస్తూ వారతని వెంట బయలు దేరుతారు. దారిలో యమునా నదిలో దిగి స్నానం చేసి అతడు లేచి నిలబడగానే ఆ నీళ్లలో కనిపిస్తారు రామకృష్ణులు. ఇదే మా రథంలోనే కదా ఉన్నది వారీ నీళ్లలోకి ఎప్పుడు వచ్చారా అని చూస్తే మరలా రథంలోనే కనిపిస్తారు. ఇలా మార్చి మార్చి అక్కడ ఇక్కడా కనిపించటం చూచి అప్పుడర్థ మవుతుందాయన కెక్కడా ఉన్నది పరమాత్మే మరేదీ లేదని. అప్పుడు చేసిన స్తోత్రమిది. అద్వైత భావమంతా పుణికి పుచ్చుకొన్న పద్యమిది. మానవుడి శరీర మనః ప్రాణాదులతో సహా మనదీ అనుకొన్న సర్వమూ నిజంలో మనది కాదు. అవన్నీ కలలో చూచిన వస్తువుల లాంటివే. ఒక్కటీ నిజంగాదు. అనవసరంగా అవి యథార్థ మని నమ్మి ఎండమావుల కోసం పరిగెత్తే లేడి కూనల లాగా పరుగెత్తు తున్నారు మానవులు. అంతకన్నా మౌఢ్యం లేదు. తత్త్వమేదో తెలియక తత్త్వాభాస కోసం పెనగులాడటం మౌఢ్యం కాక ప్రౌఢి ఎలా అవుతుంది. మరి తత్త్వ మేమిటి. అది ఎలా దొరుకుతుంది. అదే లక్ష్మీపతి. నామ రూపాత్మకమైన జగత్తంతా లక్ష్మి అయితే దీనికి మూలమైన పదార్థం కాబట్టి అది ఈ లక్ష్మికి పతి. ఇది నామ రూపాత్మక మైతే అది అనామం. అరూపం. అంటే ఆవిషయ మైన మన ఆత్మచైతన్యమే. ఇలాంటి చైతన్యమే నే నని పట్టుకోవాలి దాన్ని. పట్టుకోటాని కేమిటి ఆలంబనం. ఆయన గారి పాద యుగమే. అంటే ఈ నామ రూపాలే. “పద్యతే అభ్యామితి పదమ్- పదమేవ పాదమ్." దేని ద్వారా తత్త్వాన్ని చేరగలమో అది పాదం. అది ఈ నామ రూపాలు రెండే. అవి ఎక్కడో అందరాని చోట లేవు. విలసత్ - వివిధ పదార్థాలలో మనచుట్టూ ఎక్కడ పడితే అక్కడ లసత్ - ప్రకాశిస్తూనే ఉన్నాయి. వీటిని పలకరిస్తే చాలు. దాని గుట్టు మనకు బయట పెడుతాయి. అయితే ఎంతో చిత్త సంస్కార ముండాలి దానికి. అది లేకుంటే దాన్ని ఎలాగైనా ప్రసాదించమని

Page 128