అశ్రితుల మీద దయా రసాన్ని చిందించటమూ- కృష్ణుడికి సహజ లక్షణాలే. చెల్వల మాన ధనాన్ని చూఱలాడటమూ వారి నేడిపించటానికి మాయమై పోవడమూ కూడా సహజమే ఆ రసికా వతంసుడికి.
పోతే ఇది కూడా కాదు కవి వివక్షితం. ఈ కృష్ణ వర్ణనలో కూడా దాగి ఉన్న ధ్వనిస్తున్న ఒకానొక పరతత్త్వ భావన. అదీ మనం పరిశోధించి పట్టుకోవలసిన ఆధ్యాత్మిక రహస్యం. ఏమిటది. నల్లని వాడు. గగనం లాగా నల్లని దాతత్త్వం. గగనం దూరానికి నల్లగానే కనిపిస్తుంది. కాని దగ్గరకి వెళ్లి చూస్తే ఆ నలు పక్కడ లేదు. అది ఒక దృగ్రమ. వస్తువులో లేని గుణం మన దృష్టి ఆరోపిస్తున్నది. అలాగే పరమాత్మకు వాస్తవంగా ఏ గుణమూలేదు. ఏ రూపమూ లేదు. ఆయననొక కృష్ణుడని రాముడని మన మూహిస్తున్నా మొక రూపంలో. మరి పద్మ నయనంబుల వాడు. నిర్గుణుడైనా నిరాకారుడైనా ఆయన తన మాయా శక్తి చేత ఈ సృష్టి నంతా తయారుచేసి దీన్నిలా నడుపుతున్నాడు. నయన మంటే నడపటమే. పద్మాలీ బ్రహ్మాండ భాండాలు. మండ లాకారంగా ఉన్నాయివి. అది మధ్యాంతాలు మూడూ ఒక్కటే. వేటి కవి తానే. తన స్వరూపమే అది. పైపైన మన కందని సీమలో ఉండే ఆ రసాన్ని మన పైన చల్లుతున్నాడు. మన కందిస్తున్నాడు. అయితే మన మందుకో లేక పోతున్నాము. కారణం మౌళి పరిసర్పిత పింఛము వాడు. ఆయన మౌళి గాదిది మన మౌళి. మన బుద్ధుల చుట్టూ తిప్పు తున్నాడు తన మయూర పింఛాన్ని. అది రంగు రంగుల పింఛం. “అజామేకామ్ లోహిత శుక్ల కృష్ణామ్” త్రివర్ణాలంటే త్రిగుణాలే. త్రిగుణాత్మిక అయిన మాయే అది. అది త్రిప్పితే తిరుగుతున్నాయి మన బుద్ధులు. ఈ పరిభ్రమించే బుద్ధుల కా శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైన తత్త్వ మెలా బోధ పడుతుంది, అందుకే నవ్వురా జిల్లెడు మోము వాడు. అది మీ స్వరూపమై కూడా మీరు గ్రహించలేక పోయారే- పైగా ఎక్కడో దూరంగా దాగి ఉందని వెతుకుతున్నారే ఏమిటి మీ అవివేక మని పరిహసించట మది.
Page 125