పోతున్నపు డప్సరసలు దారిలో ఒక సరోవరంలో ఇలాగే జలక మాడుతుంటారు. నీళ్ల మీద నగ్నంగా ఈదుతున్నారో తేలుతున్నారో శుకుడు పట్టించుకో లేదు. అటు చూడను కూడాలే దా యోగీశ్వరుడు. అదే వ్యాసుడటు బయలు దేరి వచ్చే సరికి వారు హడావుడిగా వచ్చి వస్త్రాలు ధరిస్తారు. వ్యాసుడది తన కవమానంగా భావించి అడిగితే వారాయన కిచ్చిన సమాధాన మేమిటి. మనకు తెలుసుసు గదా. సరిగా అలాంటిదే ఇక్కడ కూడా సమాధానం. యోగేశ్వరుడైన శుకుణ్ణి చూచే అప్సరసలు భయపడ కుంటే యోగేశ్వరు డైన కృష్ణుణ్ణి చూచి మాత్రం భయపడటం దేనికి గోపికలు. ఈ గోపికలా అప్సరసలే గదా వాస్తవంలో. వారే గదా ఈ రూపాలతో జన్మించారు భగవత్కైంకర్యం కోసమని.
అంచేత గోపికా వస్త్రాప హరణమూ కాదు. వారితో రాసక్రీడాదులూ కావవి. జీవుల అభిమాన ధనాన్ని అపహరించటమే వస్త్రాపహరణం. విశుద్ధ సత్త్వులైన జీవులకు తన సాయుజ్యాన్ని ప్రసాదించటమే రాసక్రీడ. “రసోవైసః -” రస స్వరూపుడు పరమాత్మ. జీవుడూ రస స్వరూపుడే. వారి అన్యోన్యాత్మ భావమే రాసక్రీడ. ఇది గోపిక లెప్పుడో గ్రహించా రీరహస్యాన్ని, గోపికలు గ్రహించారో లేదో గాని పోతన దాని నెంతగానో శోధించి పట్టుకొని మన కొక పద్యంలో బయట పెట్టాడు. ఉన్నట్టుండి అంతర్హితుడైన కృష్ణుడెటు వెళ్లాడో ఎక్కడ దాగాడో దిక్కు తెలియక ఓపికలు కోలుపోయిన గోపిక లీచెట్టు ఆ పుట్టా పట్టుకొని మొర పెట్టే పద్యమిది.
"నల్లని వాడు - పద్మ నయనంబుల వాడు- కృపా రసంబు పైఁ జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు - నవ్వు రా జిల్లెడు మోము వా డొకడు - చెల్వల మాన ధనంబు దెచ్చె - నో మల్లియలార! మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే.”
ఇది ఒక దొంగను వర్ణిస్తున్నదో పరమాత్మను వర్ణిస్తున్నదో ఏమైనదీ తెలియని చాలా చిత్రమైన పద్యం. నల్లని వాడన్నప్పుడు దొంగే వాడు.
Page 123