అని ఈ ఆధ్యాత్మిక భావాన్ని అద్భుతంగా వివరించారు భగవత్పాదులు.
ఇదుగో గోపికల వ్యవహారం కూడా ఇదే. వారి వస్త్రాల నపహరించాడు కృష్ణు డంటే అవి వస్త్రాలు కావు. వారి దేహాత్మా భిమానాలే. అవే వస్త్రాల మాదిరి వారిని కప్పి ఉన్నాయి. దానితో వారు తాము వేరు పరమాత్మ వేరనే భావంతో ఆయా దేవతల పూజలూ, వ్రతాలూ చేసి ఏదో సాధిద్దామని యత్నిస్తున్నారు. అది వృథా ప్రయాస - దానిలో సిద్ధిలేదని తెలపటానికే వస్త్రాప కర్షణం చేశాడు కృష్ణుడు. వారు బయటికి వచ్చి ప్రాధేయ పడితే గాని ఇవ్వనంటాడు. అంటే దేహాభిమానం వదులు కొని సర్వమూ నేననే అద్వై తాత్మ భావంతో చూచినప్పుడే ఇస్తాను-అప్పుడీ వస్త్రాలు ధరించినా వాటితో తాదాత్మ్య ముండదు కాబట్టి ఫరవా లేదని భావం. కనుకనే వారు రావటానికి సంకోచిస్తుంటే కృష్ణుడు వారిని చూచి అనే వాక్యాలు వినండి-ఎలాంటి అర్థమిస్తున్నవో.
"శృంగార వతులార సిగ్గేల మిము గూడి పిన్న నాటను గోలె పెరిగినాడ-ఎఱుగనే మీలోన నెప్పుడు నుండుదు- నేనెఱుంగని మర్మ మేమి గలదు”
పైకి చూస్తే ఇది పరమ బూతు. కాని లోతుకు దిగి చూస్తే అంతా తాత్త్విక రహస్యమే. “ఈశ్వర స్సర్వ భూతానా” మన్నట్టు అందరి హృదయాలలోనూ ఉన్నదా తత్త్వం. అది పుట్టినప్పటి నుంచీ మనలో చోటు చేసుకొనే ఉంది. నిజంలో దానికి తెలియని మర్మం మనలో ఏ మున్నదని. ఇక అది మన స్వరూపాన్ని చూచిందని సిగ్గు పడటమెందుకు. మన స్వరూపమే అది గదా - ఎంత వేదాం తార్థమో చూడండి.
ఈ గోపికలు నగ్నంగా జలకా లాడటమూ గట్టున వారి చీర లుండటమూ అవి కృష్ణుడెత్తుకొని పోవటమూ - ఈ సన్నివేశం ఒక ప్రతి బింబమైతే దీనికి బింబ భూతమైన సన్నివేశం మనకు భాగవతా రంభం లోనే కనిపిస్తుంది. శుక మహర్షి ముందు పోతుంటే వ్యాసుడతని వెంటబడి
Page 122