మరి కృష్ణుడు వారిని నిష్ఠూరంగా మట్లాడటం ఉన్నట్టుండి తిరోహితుడయి పోవటం మరలా సాక్షాత్కరించటం- ఇవన్నీ జీవుల కీశ్వరుడు: పెట్టే పరీక్షలే. దానికి తట్టుకొని నిలిచామన్నప్పుడే వారికా ఈశ్వరానుగ్రహ లాభం. ఈ రహస్య భావమే శుకుడి మటలలో చివరనిలా చాటుతాడు మహర్షి. "గోప జనములందు గోపికలందును సకల జంతు లందు సంచరించు నా మహాత్మునకు - పరాంగన లెవ్వరు - సర్వమయుడుగాన సలిపె లీల-” ఇది అన్నిటికీ కలిపి ఇచ్చే సమాధనం.
మొదటి నుంచీ శ్రీ కృష్ణ లీలలన్నీ ఈ ఆధ్యాత్మిక రహస్య భావనతోనే సాగుతూ వచ్చాయి. వాటి నలాగే సమర్థిస్తూ వచ్చాడు పురాణ ముని.' గోపికా వస్త్రాపహరణ మేమిటి లేకుంటే. సర్వేశ్వరుడు చేశాడు కాబట్టి సరిపోయింది గాని మరొకడైతే అది ఒక రౌడీ చేష్ట అనవలసిందే గదా. తన సర్వేశ్వరత్వాన్ని వారికి తెలపటానికే చేశాడా పని కృష్ణుడు. కృష్ణుడంటే కర్షించేవాడు-లాగి వేశే వాడని అర్థం. ఏమిటా లాగవలసింది. మానవుల కున్న దేహాత్మా భిమానం. అది ఉన్నంత వరకూ మనం గోపికలమే." “గోపాయితు మిచ్ఛతీతి గోపికా” అని శబ్దవ్యుత్పత్తి. తన్ను దాచుకోవాలని ప్రయత్నించటమే గోపనం. అలా గోపనం చేసుకొనేది గోపిక. అంటే దేహాభిమాన మున్న జీవుడు. వాడికీ దేహమే ఆత్మ అనే భావ ముంది. కనుక దానికి బాహ్యమైన దంతా వాడికి వ్యతిరిక్తమే. వ్యతిరిక్త మెప్పుడయిందో అప్పుడది తన్ను చూస్తుందేమో నని భయం. “యావద్ధి భయ మధ్యస్థో 2. నిత్య మాత్మానమ్ మన్యతే- తావద్దో పాయితు మిచ్ఛత్యా త్మానమ్-” ఎంతదాకా ఈ అనిత్యమైన అత్మనే చూస్తూ భయ మధ్యస్థుడై ఉంటాడో అంత దాకా తన రూపాన్ని కప్పి పుచ్చు కోవాలనే చూస్తాడు జీవుడు. “యదాతు నిత్య మద్వైత మాత్మానమ్ విజానాతి-" నిత్యమైన అద్వయాత్మ స్వరూపాన్ని ఎప్పు డర్థం చేసుకొంటాడో "తదాకః కిమ్ కుతోవా గోపాయితు మిచ్ఛేత్”-అప్పుడెవడు దేన్ని దేనినుంచి దాచుకోవాలని కోరుతాడు.
Page 121