క్వాపి సంధ్యా ముపాసీనమ్ జపంతం బ్రహ్మ వాగ్యతం - ఒకచోట గాయత్రి జపిస్తూ సంధ్యా వందనం చేస్తుంటాడు. “మంత్ర యంతంచ కస్మింశ్చి న్మంత్రి భిశ్చోద్ధ వాదిభిః" మరొక చోట ఉద్ద వాదులైన మంత్రులతో మంత్రాంగం నడుపు తుంటాడు. ఇలా ఒకటని లేదు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కృష్ణ విగ్రహం సాక్షాత్కరించి మతి పోతుంది నారదుడికి. పైగా ఆయన కెదురు వచ్చి భగవానుడు తాముపూర్ణ కాములై అపూర్ణ కాముడనైన నన్ను దర్శింప వచ్చారా అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నలోనే ఉన్నదెంతో మర్మం. పూర్ణకాముడు పరమాత్మ. ఆయన కుండ గూడదిక ఏ కోరికా. అయినా అన్నీ అనుభవిస్తూ కనిపిస్తున్నాడు తాను. అపూర్ణ కాముడు నారదుడు. అయినా పూర్ణ కాముడి లాగా పైకి కనపడుతున్నాడు. పై కలా కనపడుతున్నా కుతూహలం ఎక్కడికి పోతుంది. కనుకనే పూర్ణ కాముడైన పరమాత్మనే పరీక్షించాలని వచ్చాడు. ఎంత గంభీరమైన మాటో ఇది.
ఇలా శిష్టులను కూడా శిక్షిస్తూ వచ్చాడు భగవానుడు. అది వారి కప్పుడప్పుడు కలిగే అహంకారాన్ని, అభిమానాన్ని, చాపల్యాన్ని పోగొట్టి పరిశుద్ధమైన సత్త్వ గుణాన్ని వారికి ప్రసాదించి తత్త్వ ప్రబోధం చేయటమే తప్ప మరేదీగాదు. అందులో కూడా ఒక చమత్కార ముంది. సహజంగా పామర స్వభావులైన వారి కందరికీ అలౌకికమైన మహిమలు ప్రదర్శిస్తాడు. మరి వివేక విజ్ఞాన వంతులైన పెద్దలకు అలాంటి లీలలేవీ ప్రదర్శించ కుండా మామూలు గానే వ్యవహరిస్తాడు. యశోదాదులకు విశ్వరూపాది లీలలు చూపటమూ- భీష్మ విదురాదులు కవి ఏమీ చూపక సహజంగా కనిపించటమూ - గమనిస్తే తెలుస్తుంది. అది ఒక లీలా భేదం. తెలిసిన వారికి నిదర్శన మక్కర లేదు. తెలియని వారికే కావాలది. ఏదో అలౌకిక మైన దృశ్యం చూపితే గాని వారికి విశ్వాస మేర్పడదు. అందుకే ఈ ప్రదర్శన. ఒకప్పుడు తెలిసిన వారు కూడ వ్యామోహంలో పడవచ్చు. అప్పుడు వారికి మరలా జ్ఞానోదయం కలిగించటానికి కూడా పనికి వస్తుందీ ప్రదర్శన.
Page 116