#


Index

  వెంటనే వారంతా దాని క్రింద తల దాచుకొని ఆ జల ప్రళయాన్ని దాటి సుఖిస్తారు. అది చూచి విస్మితుడైన దేవేంద్రుడు “నిస్తంభో: భ్రష్ట సంకల్పః స్వయం మేఘాన వారయత్" గర్వ భంగం చెంది మేఘ; మండలాన్ని ఉపసంహరించి వెళ్లుతాడు. దేవగణాలన్నీ ఆకాశం నుంచి, స్తోత్ర పాఠాలు చేస్తూ స్వామి వారి మీద పుష్ప వర్షం కురిపిస్తారు. దీనిని బట్టి గ్రహించవలసిన సత్యమేమంటే సృష్టించటానికి గాని రక్షించటానికి: గాని సకల శక్తి సంపన్నుడైన పరమాత్మకు తప్ప మరెవ్వరికీ ఆ అధికారం లేదు. ఇంద్రాది దేవతలు ఆయా అధికారాలలో ఉన్నా వారి అధికారాలు; పరిమితమే. అది తెలిసి మెలగితే వారు వివేక వంతులు. లేకుంటే వారికైనా! గర్వభంగం కాక తప్పదు. తమ కార్యం కోసమే పరమాత్మ అవతరించాడని తెలిసి దేవకీ గర్భంలో ఉండగానే వచ్చి ఆయనను స్తుతించిన వారయి కూడా బ్రహ్మాదు లహంక రించా రంటే అది ఎంతటి అవివేకమో గదా. అలాంటి అహంకారం మానవులకెలా పనికి రాదో దేవతలకూ పనికి రాదు. కేనో పనిషత్తులో ఇలాంటిదే ఒక అఖ్యాయిక వస్తుంది. పరమాత్మ అనుగ్రహం వల్ల కలిగిన విజయం తను విజయంగా భావించి గర్వించారు దేవేంద్రాదులు. అప్పుడు వారి కంతు పట్టని ఒక అద్భుతా కారం సాక్షాత్క రించి అగ్నివాయ్వాది దేవతలకు గర్వభంగంచేసి వారికికనువిప్పుకలిగిస్తుంది. అలాంటి నేత్రో న్మీలనమే ఇక్కడా జరిగింది బ్రహ్మాదుల విషయంలో.

  పోతే నారదాది మహర్హులను కూడా పట్టి చూస్తాడు భగవానుడు. పదహారు వేల రాజ కన్యలతో ఎలా విహరిస్తాడో ఆయన వైభవాన్ని పరీక్షించి చూడాలనే కుతూహలంతో బయలుదేరి పోతాడు నారదుడు ద్వారకా నగరానికి. వెళ్లి చూస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్కతీరులో సాక్షాత్కరిస్తాడు. శ్రీకృష్ణుడు. “తత్రాప్యా చష్ట గోవిందం లాల యంతం శిశూన్ సుతాన్" ఒకచోట పిల్లల నాడిస్తుంటాడు. తతోన్యస్మిన్ గృహే పశ్య న్మజ్జనాయ కృతోద్యమమ్ ఒకచోట స్నానానికి లేవబోతుంటాడు.

Page 115