#


Index

  గాని ఈతడీశుడు మాకున్" అని అర్భకుని ఈశ్వరత్వాన్ని గ్రహిస్తుందా తల్లి ఇలా సుకుమారంగా యశోదకు బోధిస్తాడు తన మహత్త్వాన్ని. మరొక మారు తల్లి తన అల్లరి భరించలేక ఉలూఖలానికి కట్టి పడవేస్తే దాన్ని: ఈడ్చుకుంటూ రెండు మద్ది చెట్లనుంచి ప్రాకిపోతాడు. అవి రెండూ విరిగిపడి నలకూబరమణి గ్రీవులనే గంధర్వుల రూపంలో కనిపించి ఆయనకు నమస్కరించి వెళ్లిపోతారు. శాపగ్రస్తులైన దేవతల నానెపంగా అనుగ్రహిస్తాడు: పరమాత్మ.

  పోతే బ్రహ్మేంద్రాది దేవతలనూ నారదాది మహర్షులను కూడా ఎంతో' సౌమ్యంగా శిక్షిస్తాడు పరమాత్మ. అఘాసురుడి బారి నుండి గోగోప బాలురను కాపాడ గలిగాడతని మహత్త్వ మెట్టిదో పరీక్షించి చూడాలని బ్రహ్మ ఎవరికీ తెలియకుండా వచ్చి వారందరినీ తీసుకుపోయి రహస్యంగా ఎక్కడో దాచాడు. తరువాత కృష్ణుడు వెతికి చూస్తే ఎక్కడా కనిపించలేదు. అదంతా విధి, వంచన అని తెలుసుకొని కృష్ణుడు "ఉభ యాయిత మాత్మానమ్ చక్రే విశ్వ! దృగీ శ్వరః" విశ్వ రహస్యమంతా ఎఱిగిన ప్రోడ కాబట్టి గోగోపకుల ఉభయ; రూపాలూ తానే తన మాయా బలంతో ధరించి ఎవరికీ ఏ మాత్రమూర్తి అనుమానం తగలకుండా సంచరిస్తూ వచ్చాడు. ఈ రీతిగా ఒక సంవత్సర కాలం గడచి పోయింది.

ఏవమ్ విమోహయన్ విష్ణుమ్ విమోహం విశ్వ మోహనం స్వయైన మాయ యా జోపి స్వయ మేవ విమో హితః

విశ్వ మోహనుడైన పరమాత్మనే మోహితుణ్ణి కావింప బోయి తానే తదీయ మాయ చేత మోహితు డయ్యాడు పితామహుడు.

ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పదయోః పతన్- ఆస్తే మహత్త్వం ప్రాగ్దృష్టం - స్మృత్వా స్మృత్వా పునః పునః

  వెంటనే వచ్చి కాళ్ల మీద పడి అంతకు ముందు యుగాంత కాలంలో తాను చూచిన భగవద్విభూతి నంతా జ్ఞాపకం చేసుకొని పునః ప్రణామం చేసి క్షమాపణ చెప్పుకొని వెళ్లిపోతాడు.

Page 113