#


Index

  జయిస్తే రెండవ పరివార మొకటున్నది. కువల యాపీడం. కువలయ మంటే భూవలయం. భూవలయాన్నంతా ఎలా పడితే అలా పీడించేది. కుత్సితంగా వలయం అంటే చుట్ట చుట్టు కొంటూ పోయేది. అదే అన్ని అనర్ధాలకూ మూలమైన ఆవిద్యా పిశాచి. పెంజీకటి లాటి నల్లని రూపం దానిది. వచ్చి మీద పడటమే తప్ప మరేమీ తెలియదు దానికి, పట్టి పాలార్చాడు దాన్ని కృష్ణ పరమాత్మ. పోతే ఇక మూడవది ఆఖరిది ఒక్కటే. అదే కాలచక్రం. కంసుడి రూపంలో ఎదట కనిపిస్తున్న దది. అంత వరకూ మారు లేకు మసలుతున్నది. ఒక్క దెబ్బతో దాన్ని జుట్టు పట్టి తమగంమీది నుంచి క్రింది కీడ్చి అంత మొందించాడు కృష్ణుడు. అంటే కాలానికే కాలుడయ్యా . డన్నమాట. కాలోస్మి లోక క్షయకృత్ప్రవృద్ధః- అని గదా భగవద్వాక్యం.

  ఇలా దుష్టులనే గాదు భగవానుడు. శిష్టులను కూడా ఒక విధంగా శిక్షిస్తూ వచ్చాడు. శిక్షించట మంటే ఇక్కడ దండించటం కాదు. బోధించటం కావచ్చు. అనుగ్రహించటం కావచ్చు. కృష్ణుడు మన్ను దిన్నాడని పిల్లలంతా వచ్చి సాడీలు చెప్పారు తల్లి యశోదకు. అన్నా మన్నేల మరి పదార్థము లేదే అని తల్లి మందలించింది. అమ్మా మన్ను దినంగ నేశిశువునో ఆకొంటినో వెఱినో అంటాడు కుమారుడు. నిజమే. ఆయన శిశువు కాదు. ఆకలి దప్పులున్న వాడూ కాదు. జీవుల లాగా వెఱివాడూ కాదు. సర్వజ్ఞు డైన భగవానుడు వెట్టి వాడెలా అవుతాడు. ఆకలి దప్పు లేమిటాయనకు. అయితే ఎందుకు తిన్నాడు మన్ను. యశోద కోసమే. తింటే గాని పిల్లలు వెళ్ళి చెప్పరు. చెబితే గాని ఆవిడ పిలిచి చీవాట్లు పెట్టదు. పెడితే చెబుదా మను కొన్నాడు. ఏమిటి. "కాదేనిస్ మదీయాస్య గంధ మ్మాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన" దండించమని. అంటూనే నోరు తెరిచాడు. ఏముంది ఆనోటిలో, మన్నూకాదు మశాస్యమూ కాదు. జలధి పర్వత వన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండం కనిపించింది. అది కలో వైష్ణవ మాయో తెలియక ఉన్నట్టుండి జ్ఞానోదయమై “ఏ మఱితిమి

Page 112