మీకు నేను వామనుడుగా అవతరించాను. ఇప్పుడు దేవకీ వసుదేవులైన మీకు నేను మూడవ జన్మలో ఈ రూపంతో ఆవిర్భవించాను. మీకీ జన్మాంతర స్మృతి కలగటానికే నేనీ అప్రాకృత మైన రూపం మీకు చూపవలసి వచ్చింది. మీరిక మీదట నన్ను పుత్ర భావంతోనూ, బ్రహ్మభావంతోనూ చూస్తూ తరిం చండి- అని బోధిస్తాడు. చూడండి. భగవ దుప దేశం ఇక్కడి నుంచే ఆరంభ మయింది. “వేదాహం సమ తీతాని" అన్న భగవ దుక్తి కిది నిదర్శనం. అతీతా నాగతవర్త మానాలు తెలిసిన వాడే సర్వజ్ఞుడు. వాడే భగవంతుడు. పైగా సంసారంలో ఉంటూనే గృహస్థులు తరించే ఉపాయం కూడా సెలవిచ్చాడు. పుత్ర మిత్ర కళ త్రాదుల నందరినీ తత్త్వద్విశేష రూపాలుగా కాక బ్రహ్మ రూపంగా దర్శించటమే ముక్తికి త్రోవ టానికే తాను జన్మించట మని కూడా చెప్పినట్టయింది. అది నిరూపించ
తరువాత జరగ వలసిన పనులు కూడా వసుదేవుడికి అప్పగించి వారు చూస్తుండ గానే పసిబిడ్డ లాగా మారిపోతాడు. ఆయన ఆదేశించినట్టే కారాగృహ ద్వారాలు తెరుచు కొంటాయి. సుదుస్తర అయిన యమున కూడా దారి ఇస్తుంది. యోగ మయావశీ కృతులై దౌవారికులూ పౌరులు అంతా గాఢ నిద్రలో మునిగి ఉంటారు.
ద్వారస్తు సర్వాః పిహితా దుర త్యయా బృహ త్కవాటా యసశృంఖలైః కిల
వసుదేవుడు బయటికి రాగానే ద్వారాలన్నీ యథా పూర్వంగా మూసుకొంటాయి. "శేషో స్వగా ద్వారి నివారయన్ ఫణైః” శిశువుకు శీతవాతాది దోషాలు తగల కుండా ఆదిశేషుడు ఫణా మండలం విప్పి గొడుగు పడతాడట. ఇదంతా భగవదను భావ విశేషం గాక మరేమిటి. మరే అవతారంలో ఇలాంటి సంరంభం చూడగలం. వసుదేవు డెప్పుడా యశోద వద్ద బాలుణ్ణి దించిందీ- ఆవిడ నుంచి మాయా కన్య నెప్పుడు
Page 109