#


Index

  కాబట్టి ఆయన శక్తి తేజో రూపిణి-జీవుల శక్తి లాగా తమోరూపిణి గాదు. మన బోటి జీవు లంతా అజ్ఞాన తిమిరాంధులు కాబట్టి వీరి శక్తి కూడా తమోరూపిణే. తమో రూపిణి గనుకనే ఇది మనకు వరణీయ కాదు. వరణీయ ఎప్పటి కైనా తేజో రూపిణి అయిన పరమాత్మ శక్తే. అదే భర్గ మంటే.. దాని నెప్పుడో ఏ జన్మలోనో కోలు పోయాము మనం. మరలా దాన్ని పొందే ప్రయత్నం సాగించాలి. అందుకోసం నిరంతరం దాన్ని భక్తి తాత్పర్యాలతో ధ్యానించటం తప్ప మరొక మార్గం లేదు. అలా ధ్యానిస్తే అది మరలా మన బుద్ధులనీ తమస్సు నుంచి తప్పించి ఆ తేజస్సు వైపుకే తీసుకెళ్లు తుంది. సందేహం లేదు. ఈ గాయత్రీ రహస్యమంతా ప్రస్తుత మీ యోగ మాయ అవిర్భ వించటం లోనూ అంతర్ధానం చెందటం లోనూ గుప్తమయి ఉంది. పరమాత్మ అవతరించ టానికి ముందే అవతరించిం దాయన తేజో రూపిణి అయిన ఈ మాయ. అయన రాకను ముందుగా సూచించింది లోకానికి, దేవకీ గర్భాన్ని సంకర్షణ చేసిరోహిణీ గర్భంలో ప్రవేశ పెట్టటం జీవుణ్ణి ప్రాపంచిక మైన స్థాయి నుంచి పారమార్థిక మైన భూమికకు ప్రచోదన చేయటమే. అది నిత్యమూ మన దగ్గరే ఉన్నా దాని ప్రభావాన్ని మన అజ్ఞాన వశాత్తు గుర్తించలేము. దీనికి చిహ్నమే యశోదా నందాదు లకు దాని అస్తిత్వాన్ని గురించి స్మృతి లేక పోవటం. పోతే చూచి కూడా తెలుసుకోలేని మూఢులు కొందరుంటారు. కంసుడి లాంటి వాళ్లు. వాళ్లకదిఎప్పుడూ చిక్కదు. అతీతంగా విహరిస్తుంటుంది. ప్రచోదయంతీ పవనే ద్విజాతా అన్నట్టు అంతరిక్షంలోనే సంచరిస్తుంటుందా గాయత్రి. అష్ట భూజాలతో కనపడటం గాయత్రీ లక్షణమే. తుద కావిడ మహత్త్వాన్ని తెలుసు కొని నిత్యమూ భక్తి శ్రద్ధలతో జపించే వారికి సర్వ కామ ప్రదాత్రి అని వర్ణించటంలో కూడా “ఆయుః పృధివ్యాం ద్రవిణం బ్రహ్మ వర్చసమ్ దత్వా" అనే మంత్రో పాసకుల శుభ కామన మనకు బాగా వ్యక్త మవుతుంది.

Page 106