#


Index

  ఇక్కడ రెండు రహస్యాలు మనం గ్రహించ వలసి ఉంది. దేవకి అష్టమ గర్భమే కంస వధకు కారణం. అంత వరకూ కంసుడికి భయం లేదు. దాని కోసం ప్రతీక్షిస్తున్నాడు వాడు. ఆరు గర్భాల నప్పటికే హత మార్చాడు. ఇక ఏడవ దాని కోసం చూస్తుండగా అది యోగ మాయ మూలంగా దేవకి నుంచి రోహిణికి రవాణా అయి పోయింది. ఇది తెలియక లోకులంతా ఆవిడ గర్భం దిగజారి పోయిందనుకొంటే కంసుడు కూడా అలాగే అనుకున్నాడు. ఇక వచ్చేది భగవదవ తారమే కదా అని వెయ్యి కళ్ళతో చూస్తుంటే తరువాత అది కూడా తారుమారవుతుంది. ఆ విజ్జోడు పడిన బిడ్డనే చూచి వాడష్టమ గర్భ మదే నని భ్రమించి విఫల ప్రయత్ను డవుతాడు. ఇదే వైష్ణవ మాయ. ఇంత కన్నా పెద్ద మాయ ఏమంటే రోహిణికి గర్భమెలా వచ్చిందో ఎవరికీ అంతు పట్టక పోవటం. వసు దేవుడికి దూరంగా ఎక్కడో నంద గోకులంలో ఉన్న రోహిణి గర్భం తాల్చట మేమిటి. లోకులను మానించక పోవట మేమిటి. దానికి కూడా ఈ యెగ మాయాప్రభావమే సమాధానం. ఎక్కడి కక్కడ భగవన్మాయ పని చేస్తూనే ఉందని భాగవతమే మనకు సమాధాన మిస్తున్నది. యుక్త వయసు వచ్చిన తరువాత దేవకీ వసు దేవుల నొకసారి చూడటాడికి వెళ్లివారు తన మాహాత్మ్యాన్ని ప్రశంసించ బోతే వారెక్కడ తాను దేవుడని భావిస్తారో అని "మాభూదితి నిజామ్ మాయామ్ తతాన జన మోహినీమ్” సకల జన సమ్మోహిని అయిన తన మాయ వారి మీద ప్రయెగించా డట. దానితో వారు మామూలు కుర్ర వాడేనని భావించి మురిసి పోయారట. ఇదుగో ఇలాంటి సమ్మోహినీ మంత్రాన్నే వ్రేపల్లె లోని ప్రజల మీద కూడా ప్రయోగించి ఉంటాడు పరమాత్మ. అసలు యోగ మాయ జరిపిన కార్య మన్నప్పుడే అది మాయామయం. అది ఈ లోకుల లౌకిక ప్రజ్ఞ కంతు చిక్కే వ్యవహరం కాదు. కనుకనే రోహిణీ గర్భ వృత్తాం తాన్ని మామూలు విషయం గానే భావించారు గాని ఎవరు గాని ఇది ఎలాగబ్బా అని లేశ మాత్రం కూడా అవిడ శీలాన్ని శంకించిన వారు కారు.

Page 104