#


Index

  భూదేవి దుర్మార్గుల పాపభారం మోయలేనని బ్రహ్మతో పోయి మొరపెడితే ఆయన దేవతలతో సహా క్షీరసాగరానికి వెళ్లి నారాయణమూర్తికి వినకారు చేస్తే ఆకాశంలో ఆయన కొక వాణి వినిపిస్తుంది. అది విని బ్రహ్మ వారితో ఇలా అంటాడు.

  వసుదేవ గృహే సాక్షా ద్భగవాన్ పురుషః పరః జనిష్యతే- తత్పూజార్థమ్ సంభవంతు సురస్త్రీయః వాసుదేవ కళా నంత స్సహస్ర వదనః స్వరాట్ అగ్రజో భవితా దేవో హరేః ప్రియ చికీర్షయా విష్ణోర్మాయా భగవతీ యయా సమ్మోహితం జగత్ ఆ దిష్టా ప్రభుణా ంశేన కార్యార్ధమ్ సంభ విష్యతి సాక్షాత్తు భగవానుడే వసుదేవ గృహంలో జన్మిస్తాడు. ఆయన కళాంశమైన ఆనంతుడు బలరాముడుగా అవతరిస్తాడు. యోగ మాయ ఆయన కార్యం, నెరవేర్చటానికి యశోద కుదయిస్తుంది. దేవతా స్త్రీలంతా స్వామి వారి సేవకోసం భూమి మీద గోపికలుగా జన్మించ బోతారు.

  తరువాత కొంత కాలానికి కంసుడికి ఆకాశవాణి హెచ్చరిక చేయటం- వాడు భయపడి దేవకిని వధించ బోవటం వసుదేవుడి ఒప్పందంతో విరమించు కోవటం- జరుగుతుంది. అష్టమ గర్భం గదా తన వినాశానికి కారణ మని బరవసాతో వసుదేవుడు తెచ్చి ఇచ్చిన బిడ్డని గూడా వద్దని పంపుతాడు. కాని నారదుడు సందు చేసుకొని వచ్చి ఒకనాడతనితో వెఱి వాడా వ్రేపల్లెలో ఉండే నందాది గోపకులూ - మధురలో ఉండే వృష్టి వీరులూ అందరూ భగవత్కార్యార్ధ మవతరించిన దేవతలే సుమా నిన్నను సరించి ఉన్న జ్ఞాతులంతా అసురాంశలు - నీ వధ కోసమే విష్ణువు స్వయంగా దేవకికి జన్మించ బోతున్నాడు. ఆ దేవకీ వసుదేవులను నీవుపేక్షించ కుండా బంది ఖానాలో పడవేయమని చెప్పి వెళ్లిపోతాడు.

Page 102