#


Index

  ఆ తరువాతనే కలి పురుషుడు వాటిని తన్నటమూ పరీక్షిత్తు వాడి మీద చేయి చేసు కోవటమూ జరుగుతుంది. ఏమిటీ ఉదంతంలోని ఆంతర్యం. ఇది ధర్మ భూదేవతల సంవాదం కాదు. తదప దేశంతో సాగిన పరమాత్మ మౌన సందేశం. ఎవరికా సందేశం. ఎవరు దేశాని కంతా పాలన భారం వహిస్తే వాడికి. వాడు ప్రస్తుతం పరీక్షిత్తే. “నా విష్ణుః పృథివీ పతిః" అన్నారు. విష్ణ్వంశ లేని వాడు ప్రజా పాలకుడు కాలేడు. సృష్టి, స్థితి, లయాలలో స్థితి కర్త విష్ణువు గదా. ఆ స్థితిని చూడ వలసిన వాడే క్షత్రియుడు కూడా. అది నేను లోకంలో అవతరించి చూడవలసి నంతగా చూచాను. నలుగురి చేతా చేయించాను. యుగాంతమై నేనిప్పుడు నిష్క్రమిస్తున్నాను. మరినాతో పాటు ధర్మంకూడా నిష్క్రమించ కుండా చూడవలసిన బాధ్యత మీ బోటి క్షత్రియుల మీద ఉన్నది. నేనున్నా లేకున్నా చూడాలి మీరు. అలా పరీక్షించి చూచే వాడవు గనుకనే నీ తండ్రి నుపేక్షించినా నేను గర్భంలోనే అంతరించ కుండా నిన్ను రక్షించాను. విష్ణురాతుడవైన నీవు విష్ణువు లాగా లోకస్థితి నెలా కాపాడ గలవో మరి సకల ధర్మ నిర్మూలకమైన కలికాలం వచ్చి పడింది. దీని కేమిటి నీ సమాధాన మని పరీక్షిత్తుకు చేసిన 'పెద్ద హెచ్చరిక ఇది. అందుకే జన్మ వృత్తాంత మింకా ప్రస్తావన చేయక ముందే పురాణా రంభంలోనే కృష్ణ నిర్యాణ వార్త వినిపిస్తున్నాడు బాదరాయణుడు. ఈ విషమ మైన కలికాలంలో బ్రతికే రాజులేమిటి. ప్రజలేమిటి. ప్రతిఒక్కరికీ ప్రపంచ పరిస్థితులను జ్ఞాపకంచేస్తూ అందులో ఎవరి బాధ్యతలు వారెలా నిర్వర్తించాలో తద్వారా విశ్వ ధర్మ ప్రతిష్ఠాపన కెలా సహకరించాలో చేసే బ్రహ్మాండమైన ప్రబోధ మిది. నిర్యాణా నంతరం పరమాత్మ చేస్తున్నా డిది మనకు మౌన భాషతో.

  పోతే ఇక ఆయన జన్మ వృత్తాంత మెక్కడో దశమ స్కంధంలో గాని రాదు. నిర్యాణ మెంతో కృష్ణుడి జననం కూడా అంత పరమాద్భుతమైన విషయం. అక్కడకూడా ఆయన సాక్షాన్నారాయణతత్త్వం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.

Page 101