#


Index

సామగ్రిని చక్కగా పోషిస్తే చాలు. దాని బలంతో భావుకుడైనవాడి కా రసానుభవం కలిగితీరుతుంది. అప్పుడా రసస్వరూపం కవి చెప్పకుండానే తెలిసిపోతుంది. ఇదే మహాకవి కుండవలసిన నైపుణ్యమూ - ప్రౌఢి.

  అది వాల్మీకి మహర్షి కన్నా ఎక్కువ ఉన్న వాడెవడు సాహితీ ప్రపంచంలో. కనుకనే మహర్షి భగవచ్చబ్దాన్ని బాహాటంగా ఎక్కడా ప్రయోగించకపోయినా కథాగమనంలో దాన్ని సమయం వచ్చినప్పుడల్లా చాటుమాటుగా ధ్వనింపజేస్తూనే ఉన్నాడు. ధ్వని మార్గంలో నడచిన ఆ వ్యవహార మోలాంటిదో కావ్యారంభం నుంచీ అరసి చూస్తే తెలుస్తుంది మన కందులోని గాంభీర్యం. ఉపక్రమోప సంహారాలలో ఏకవాక్యత (con- sistency) అనేది శాస్త్రానికే గాదు. కావ్యానికి కూడా ఆవశ్యకం. అప్పుడే కావ్యాత్మ అనేది పదహారు కళలతో మన కున్నులకు కడుతుంది. రామాయణా ద్యంతాలలో ఇది ఐతిహాసిక మర్యాదలో కంఠోక్తిగానే చాటాడు మహర్షి. కథానాయకుడు సామాన్యుడు కాడు. లోక నాయకుడైన భగవానుడేనని. చూడండి. దశరథుడు ఋశ్యశృంగాదుల సహాయంతో పుత్రకామేష్టి సలుపు తుంటాడు. ఆ సందర్భంలో తమ తమ హవిర్భాగాలకోసం దేవతలంతా అంతరిక్షంలో గుమిగూడి సమయాని కక్కడికి వచ్చిన బ్రహ్మతో తమ గోడు విన్నవిస్తుంటారు. అతడిది విష్ణుదేవుని వల్లనే కాని మరొకరివల్ల సాధ్యమయ్మేది కాదని చెబుతూండగా విష్ణువే స్వయంగా వస్తాడక్కడికి. వారు నారాయణుడికి సాష్టాంగపడి రావణుడి వల్ల తమకు వాటిల్లిన కీడు బపమని ప్రాధేయపడితే అలాగేనని మాట ఇచ్చి పుత్రకాముడైన దశరథుడికి రాముడనే పేరుతో అవతరించాడని గదా వర్ణించాడు కవి. పైగా మానవులవల్ల తప్ప మరెవరివల్లా చావులేకుండా వాడు వరం సంపాదించాడు కాబట్టి మానుష్యే చింత యామాస జన్మభూమి మథాత్మన:- మనుష్యలోకంలో మనుష్యుడుగానే జన్మించాలని సంకల్పించాడు. పైగా దేవతలతో ఇలా అంటాడా దేవదేవుడు. హత్వాక్రూరమ్ దురాత్మానమ్ దేవర్షీణామ్ భయావహమ్ దశవర్ష సహస్రాణి - దశవర్షశతానిచ

Page 10