#


Index

ధర్మ సూక్ష్మములు

సీతా పరిత్యాగమనేది. సీత అంటే చాలా ఇష్టం రాముడికి. అయితే అంతకన్నా ఇష్టమైనది ధర్మం. ఆ ధర్మం కోస మిష్టమైన పత్నిని కూడా పరిత్యజించవలసి వస్తే వెనుక ముందు చూడగూడదు. అప్పుడే రాముడు లోకాభిరాముడవుతాడు. లేకుంటే జానకీరాముడే అయి కూచుంటాడు. ఇక్కడ మనమొక విషయం గ్రహించాలి. భార్యను వదిలేయటమంటే ఎంత కావలసిన పదార్థమైనా వదిలేయాలని కాదు. అయితే రాముడు భార్యనే వదిలేడు గదా అంటే అది ఒక సంకేతమే. ఒక వైద్యుడు మన రోగానికి పథ్యం చెప్పేటప్పుడు పచ్చి మంచినీళ్లు త్రాగకూడదని చెపుతాడు. కాని అంత కఠిన పథ్యం చేస్తే చచ్చి కూర్చుంటాడు రోగి. మంచినీళ్లు కూడా తాగకూడదని ఎందుకన్నాడు మరి. అలా అనకపోతే కూడు తింటాడని భయం. దానితో రోగం తిరగబెడుతుంది. చావుకు పెడితే లంకణాలకు దిగుతుందన్నట్టు అంత తీవ్రంగా చెబితే గాని జాగ్రత్తగా ఉండడు పథ్యం విషయంలో అలాగే ఇక్కడా వ్యవహారం. భార్యనే పరిత్యజించాడని చూపటం పాలితులపట్ల పాలకులెంత నిస్వార్ధంగా ప్రవర్తించాలో పాలకలోకానికి మహర్షి మార్గాంతరంగా బోధించటమే. మరేదీ గాదు. హరిశ్చంద్రాది రాజన్యుల కథలన్నీ కూడా ఇలాంటివే.

  అయితే ఇక్కడ రాముడు చేసిన చర్యలో మరొక రహస్యం కూడా ఉందిమనం గ్రహించవలసింది. రాముడు హరిశ్చంద్రుడిలాగా మానవమాత్రుడు కాదు. పరమాత్మే ఆ రూపంలో అవతరించాడు. ఆయన అవతార ప్రయోజనం కేవలం ధర్మపాలన. ఆ కార్యాన్ని సాధించటానికి తోడు చేసుకొన్న ఉపాధులే సీతా లక్ష్మణాది పాత్రలన్నీ. తన ప్రయోజనం తీరేంతవరకే వారితో ఆ ఉపాధులతో సంబంధమాయనకు. తీరిన తరువాత ఇక అక్కరలేదు. ఏదో ఒక నెపం పెట్టి వారిని దూరం చేసుకోవలసి ఉంది. అలాంటి దూరీకరణ ప్రయత్నంలో ఒక భూమికే ఈ సీతా పరిత్యాగం. ఇది మొదటి భూమిక అయితే లక్ష్మణ పరిత్యాగం రెండవ భూమిక. ఈవిడను త్యజించటానికి ప్రజాపవాదం మీద నెపం పెట్టాడు. అతణ్ణి త్యజించటానికి దుర్వాసుడి మీద నెపం పెట్టాడు రెండూ బుద్ధి పూర్వకంగా చేశాడు. మమాపిహృదివర్తతే నాకూ ఇది మనసులో ఉందని యమధర్మరాజుతో చెప్పిన మాటలో ఇది కూడా ధ్వనిత మవుతూ ఉంది. మిగతా విభీషణాదులు అందరూ వదలిపోయినా రాముడికి సీతాలక్ష్మణులిద్దరూ ఇంకా వదలలేదు. వీరిని వదిలించుకొంటే గాని తాను సుఖంగా

Page 197

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు