లక్ష్యం మీద దృష్టికి శ్రద్ధ అని పేరు. అది ఉంటే దానికి తగిన ఆలోచనా -ప్రవర్తనా తప్పకుండా ఏర్పడతాయి. అది ఎప్పటికైనా జీవిత గమ్యాన్ని చేరుస్తుంది. సందేహం లేదు.
ఇది మూడు విధాలీ శ్రద్ధ అనేది. సత్త్వాది గుణాలను బట్టే ఏర్పడుతాయవి. సత్త్వం వల్ల సాత్త్విక శ్రద్ధ. రజస్సు వల్ల రాజస శ్రద్ధ. పోతే తమస్సు వల్ల తామస శ్రద్ధ. అవి మరలా వారు వారు తీసుకొనే ఆహారాన్ని బట్టి ఏర్పడుతాయి. అన్నింటిలోనూ సాత్త్వికమైన శ్రద్ధ ఉన్నవాడు సాత్త్వికమైన ఆహారమే సేవిస్తాడు. ఆయుస్సూ బలమూ ఆరోగ్యమూ పెంచే రసవంతమైన హృద్యమైన ఆహారమే వాడికిష్టం. కట్వామ్ల లవణాదులు కావు. అవి రాజసుల కిష్టం పోతే పాసిపోయిన చెడిపోయిన అన్నపానాలు -తామసులకు ప్రీతికరం.
ఇక యజ్ఞమూ తపస్సూ దానమూ మొదలైనవి కూడా ఎన్నో ఉన్నాయి వారి వారి శ్రద్ధను బట్టి ప్రవర్తించేవి. ఫల నిరపేక్షంగా కేవలం తనకు కర్తవ్యమని చేసేదే సాత్త్వికమైన యజ్ఞం. వేద గురు పూజా శౌచమూ బ్రహ్మచర్యమూ శారీరమైన తపస్సు. సత్యమూ ప్రియమూ హితమైన వాక్కు వాఙ్మయ తపస్సు. మనశ్శుద్ధి మౌనం సౌమ్యత్వం ఇంద్రియ
Page 62