దీనితోనే చివరకు కన్నుమూస్తున్నారు లోకులు. ఇదే సంసార బంధం. దీనికి కారణం గుణ సంగ మంటున్నది గీత. సత్త్వరజస్త మస్సులనే ప్రకృతి గుణాలు బంధిస్తున్నాయి మానవుణ్ణి. మనలో ఉన్నవి ఈ త్రిగుణాలే. మనస్సు సత్త్వం. ప్రాణం రజస్సు - శరీరం తమస్సు. ఇక గుణాత్మకం కాని దేది మానవుడిలో. పోతే ఈ గుణాలతో తాదాత్మ్యం Identity చెందిన నేరానికి ప్రపంచమంతా త్రిగుణాత్మకంగానే కనిపిస్తుంటుంది. ప్రపంచమంటే దేశ కాల వస్తు సముదాయమే గదా. దేశం సత్త్వమైతే కాలం రజస్పైతే వస్తుజాలమంతా తమస్సు. కాబట్టి బాహ్య జగత్తు కూడా గుణమయమే. దృద్ధృశ్యాలు రెండూ గుణమయమే అయ్యేసరికి బంధం తప్పదు. ఇది ఇలా ఉన్నంత వరకూ క్షేత్ర క్షేత్రజ్ఞుల ఏకత్వం సిద్ధించదు. సిద్ధించకుంటే మోక్షం లేదు మానవుడికి.
అయితే ఈ బంధం నుంచి బయటపడే దెలా మానవుడు. గుడ్డిలో మెల్ల అన్నట్టు సత్త్వగుణం కొంతమేలీ త్రిగుణాలలో. అది ప్రకాశకం అనామయం. వివేక జ్ఞానానికి తోడు పడుతుంది. దాని ఆసరాతో ఒక పని చేయాలి సాధకుడు. నాన్యం గుణేభ్యః కర్తారం - త్రికరణాలతో మనమే పనిచేసినా అది గుణాలే చేస్తున్నాయి నేను గాదు. మరినేనెవరంటే గుణేభ్యశ్చపరం- గుణాలకు సాక్షిగా ఉన్న
Page 58