#


Index

ప్రస్థానత్రయ సారము

నిజంలో నేననే జ్ఞానమెప్పుడూ మారదు మరణించదు. చైతన్య రూపంగా అందరూ నిత్యులే. దేహమే అనిత్యం. దేహి కాదు. బాల్యయౌవనాది దశలన్నీ దేహానికే గాని దేహికి అంటవు. దేహి చేతనంగా సర్వత్రా ఉన్నాడు. దాని నెవరూ నశింపజేయ లేరు. నశించేవి శరీరాలే. వాటికే జనన మరణాలు. త్రిగుణాత్మకమవి. గుణసంపర్కం వల్లనే దేహి అయిన ఆత్మ జనన మరణాల పాలయి బాధ పడుతున్నాడు. అవిద్యా కామ కర్మల వల్లనే ఈ దేహ సంబంధం మానవుడికి.

  అవిద్య వల్ల కారణ శరీరం. కామం వల్ల సూక్ష్మ శరీరం. కర్మ వల్ల స్థూల శరీరం మూడు శరీరాలతో -సంపర్క మేర్పడింది. మిగతా రెండింటికీ అవిద్యే మూలం. అందుకే కారణ శరీరమన్నారు దాన్ని. తాను కాని దాన్ని తానని భ్రమపడటమే అవిద్య. అది మన చైతన్యాన్ని ఆవరించి శరీరం మేరకు తగ్గించింది. దానివల్ల మిగతాదంతా ప్రపంచంగా కనిపించి అది పొందాలనే కామ మేర్పడింది. ఇదే సూక్ష్మ శరీరం. కామాని కనుగుణంగా తనకు కావలసిందంతా పోగు చేసుకొనే కర్మ ఏర్పడింది. ఇదే స్థూల శరీరం. అది ఫలిస్తే సంతోషం. ఫలించకుంటే విషాదం.

  కాబట్టి బుద్ధి యుక్తో జహాతీహ. ఆత్మ అంటే ఏమిటో దాని జ్ఞానమార్జించాలి. అప్పుడు విహాయ కామాన్ - కామాన్ని

Page 39

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు