#


Index

ప్రస్థానత్రయ సారము

చేస్తే జయమో అపజయమో చెప్పలేము. పరిస్థితులను కూలమైతే విజయం. ప్రతికూలమైతే పరాజయమే. చాలావరకు మన మాసించిన దెప్పుడూ జరగదు. అనుకూలించదు. కనుక పరాజయమే మూడు వంతులు. అందుకే తరుచు విషాదమే ఎదురవుతుంది మానవుడికి.

  ఏమి కారణం. పరిస్థితులను కూలించకనా. కావచ్చు. ఎందుకనుకూ లించటం లేదు. అహంకార మమకారాలే దీనికంతటికీ కారణం. ఈ శరీరం మేరకే నేనని అభిమానించటం అహంకారమైతే మిగతా దంతానా కన్యమని చూడటం మమకారం. శరీరం వర కాగిపోతే మిగతా దన్యం గాక ఏమవుతుంది. అందులో కూడా తనకు కావలసిందైతేనే మరలా మమ అని చూస్తాడు. లేకుంటే న మమ - నాకక్కర లేదని త్రోసిపుచ్చుతాడు. ఇవే రాగద్వేషాలనే ద్వంద్వాలు. వాటివల్ల సుఖదుఃఖాలు. ఇదే సంసార బంధం. అన్నిటికీ మూలమీ అహంకారమే. అంటే దేహాత్మాభిమానం. అది మమకారానికి దారి తీస్తే -అది అనుకూల ప్రతికూలాలను సృష్టిస్తే దానివల్ల సుఖదుఃఖాది ద్వంద్వ లేర్పడుతున్నాయి. అర్జునుడి కెదురయిన సమస్య ఇదే. ఇదే విషాదం. -

Page 37

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు