#


Index

ప్రస్థానత్రయ సారము

కలిపి పట్టుకుంటే అది సకలం. అప్పుడు సంసారమే గాని సాయుజ్యానికి నోచుకోలేడు జీవుడు. ఎందుకంటే వీడి బుద్ధీ సకలమే. వీడు చూచే ప్రపంచమూ సకలమే. అంచేత ఈ సకలాన్నే మరలా నిష్కలంగా చూడాలి మనం. అంటే ఎక్కడి నుంచి ఈ కళలు జన్మించాయో అక్కడే వీటిని లయం చేసి చూడాలి. చూస్తే అప్పుడీ ప్రపంచమే పరమాత్మగా మారి దర్శనమిస్తుంది. నదులన్నీ మరలా సముద్రంలో కలిసి సముద్రమనే ఒకే ఒక రూపంగా మారినట్టు ప్రాణేంద్రియాది విశేషాలన్నీ నిర్విశేషమైన ఆత్మ చైతన్యంగా అనుభవానికి రాగలవు. అలాంటప్పుడిక జనన మరణాది చింత ఏముంది. అవీ కళలే కాబట్టి చైతన్యరూపంగా నిష్కలమై అనుభవానికి వస్తాయని ప్రశ్నోపనిషత్తు పరిష్కారం.

ముండకోపనిషత్తు

  ఇందులో ఉపపత్తి ఏమంటే ఎందులో నుంచి ఒకటి జన్మిస్తుందో అది అందులోనే చివరకు లయమవుతుంది. అసలది జన్మించటం దాని జన్మస్థానం ఫలానా అని మనకు చూపటానికే. కార్యాన్ని బట్టి కారణాన్ని అందుకోవాలి మానవుడు. అందుకే సృష్టి వాస్తవంగా జరగకపోయినా జరిగినట్టు వర్ణిస్తుంది శాస్త్రం. ఈశ్వరుడు జీవుడుగా వచ్చి

Page 16

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు