రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మున్నదే ఆవిడ. మాధవ సేనుడి సహోదరి. ఇది చివరి దాకా తెలియదా మానవుడికి. ఎవతో పరాయిదని భ్రమపడ్డాడు. తన శక్తే అయినా తనకు అన్యదీయ అనుకోవటమే గదా జీవుడి భ్రమ. అందులోనూ ఆవిడ పట్ట మహిషి కధీన. ఆవిడ దానిని బయట పడకుండా కాపాడుతున్నది. ఆ కన్య చిత్రపటం దైవికంగా చూచి దానితోనే తృప్తి పడవలసి వచ్చిందా రాజు. అంతే కదా మరి. వ్యక్తమైన ఆకృతే అవ్యక్తమైన శక్తిని కానరాకుండా చేస్తున్నది. దాని ఛాయ మాత్రమే చూపుతుంది గాని సహజమైన దాని స్వరూపాన్ని చూపదు. చూపితే దీనికిక ప్రాధాన్యం లేదు. అలాగే జరిగింది. అయినా తావన్మాత్ర దర్శనంతో నిలవలేక పోయాడు నాయకుడు. అగ్నిమిత్రుడు కదా అతడు. స్వభావ మెక్కడికి పోతుంది. లోలోపల ఆవిడ అసలు రూపాన్ని చూడాలని తపిస్తున్నాడు. దానికి దారి చూపే గురువొకడు కావాలి. అతడే విదూషకుడు. వానికి పరోక్షంగా పరివ్రాజిక తోడయింది. ఈవిడ ఎవరో కాదు. మాధవసేన సచివుడు సుమతి తోబుట్టువు. అతని మరణానంతరం విరక్తితో పారివ్రాజ్యం స్వీకరించి రాజ కులం చేరింది. అంతకు ముందే దైవవశాత్తూ అక్కడే చేరింది కాందిశీక అయి మాళవిక. కాగా వీరిరువురూ నాట్యాచార్యులైన గణదాస హరదత్తులకు పోటీ పెట్టి తన్నిమిత్తంగా మాళవిక నాట్య మేర్పాటు చేస్తారు. రాజు నలుగురితో పాటు ఆవిడ నిజస్వరూపం చూచి ముగ్ధుడవుతాడు. అది చూచినప్పటి నుంచీ ఇక ఆవిడ పొందు కోసం పరితపన. ఇది గమనించి పట్టమహిషి ఆవిడ నీతో ధికంగా కాపాడటం. అయినా విదూషకుని పన్నాగంతో రాజావిడను కలవటం. ధారిణి అది తెలిసి ఉగ్రురాలు కావటం. చివర కావిడ ఎవరో కాదు స్వకీయయే అని తెలిసి రాజు కావిడే స్వయంగా సమర్పించటం- క్రమంగా జరిగిపోయిన సంఘటనలు.
ఇంతకూ కథా వస్తువెక్కడి నుంచి ఎక్కడికి మలుపు తిప్పాడో చూడండి మహాకవి. ప్రధమాంకంలో నాయిక ఛాయాదర్శనం. ద్వితీయంలో స్వరూప దర్శనం. తృతీయంలో సంగమాభిలాష, చతుర్ధంలో ప్రచ్ఛన్న సంగమం.
Page 99