#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

శక్తి స్వరూపిణులే. అమూర్తమైనది ఒక రూపమైతే మూర్తమైన దొక రూపం. 1 అమూర్త మైనంత వరకూ అది తన్ను బాసి ఉండదు. తనతోనే కలిసి ఉంటుంది. అదే మూర్తమైతే తనకు దూరంగా తొలగుతుంది. మూర్తమైనది జడ శక్తి. అమూర్త మైనది చిచ్చక్తి. జడశక్తి వశంలో ఉన్నా సుఖం లేదు. దూరమైన చిచ్చక్తినే వశం చేసుకోవాలి. అప్పుడే శివశక్తి సామరస్యం. ఇందులో జడ శక్తికి ప్రతీక పట్టమహిషి, చిచ్చక్తికి ప్రతీక మధ్యలో వారి దృష్టి నాకర్షించిన నాయిక. మొదటిది భూదేవి. రెండవది శ్రీదేవి. జడ గనుక అది భూదేవి. చేతన కనుక ఇది శ్రీదేవి. భవించే స్వభావ మున్నది భూదేవి. శ్రయించే శీలమున్నది శ్రీదేవి. మూర్తీభవించటమే భవించటం. అమూర్తమై తన్ను ఆశ్రయిస్తే అది శ్రయించటం. ఈ శ్రయించే శ్రీదేవే కావాలి పరమాత్మకు. అప్పుడే అతడు స్థితి గతులకు నోచుకొంటాడు. మరి పరమాత్మకు ప్రతీకలే నని గదా పేర్కొన్నామా నాయకులను. కనుకనే వారు తమ పట్ట మహిషులతో తృప్తి పడక పైన వచ్చిన ఈ మహిషుల వెంటబడటం. పట్టమహిషి భూదేవికి ప్రతీక. భూపర్యాయమైన నామకరణమే చేస్తాడు వారికి కాళిదాసు. ధారిణి అని వసుమతి అని వారిని పేర్కొనటమే ఇందుకు నిదర్శనం.

  పోతే వీరితో నిత్యమూ కలిసి ఉన్నా సంయుక్తులు కారు వారు వియుక్తులే. అమూర్తమైన తమ శక్తి తమకు వశంవద కానంత వరకూ అది యోగ మెలా అవుతుంది. వియోగమే వాస్తవానికి మూర్తం నిత్యానపాయిని కాదు. అమూర్తమే నిత్యానపాయిని. అది తనదే అయినా దాన్ని ఈ మూర్త ప్రపంచంలో పడి మరచిపోయి ఎంతో కాలం దానికి దూరమయి బ్రతుకు సాగించాడు. దైవికంగా అది మధ్యలో ఎక్కడో తనకు దర్శన మిచ్చింది. సహజమైన అనురాగంతో దాన్ని దక్కించు కోవాలని వెంటబడ్డాడు. కాని తన మూర్తమైన వాసన లింకా వదలక అది తళుక్కున మెరిసి మాయ మయింది. అయినా దాన్ని పొందే వరకూ నిద్ర పట్టక పిచ్చిగా దాని కోసం పలవిస్తూ కూచుంటాడు. నిరంతర తదీయ చింతన తన మూర్త ప్రపంచ వాసనలను క్షాళితం చేయగా

Page 97

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు