#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పరోక్షమని భావించే ఆ ఆత్మ చైతన్యమూ - రెండూ ఆత్మ స్వరూపంగా ప్రత్యక్షమే సాధకుడికి. చైతన్యం శివ రూపంగానైతే - జగత్తు శక్తి రూపంగా.

  ఇదుగో ఈ శివ శక్తి సామరస్య రూపమైన ప్రత్యభిజ్ఞా సూత్రాన్ని సజీవంగా చిత్రించటానికే మహా కవి మూడు కావ్యాలతో తృప్తి చెందక మూడు నాటకాలు కూడా రచించాడు. ఇంకా బలంగా చిత్రించాడా భావాన్ని వీటిలో. ఆ భావ చిత్రాన్ని మనకు సూచన చేయటానికే నాటకారంభంలో వర్ణించిన ఈ మూడు నాందీ శ్లోకాలూ. మనాక్కావ్యార్థ సూచన చేయాలని కదా ఆలంకారికు లాదేశించారు. ఆ సూచన మనాక్కేమి కర్మ మహా విపులంగానే చేసి చూపాడు కాళిదాసు. నా కావ్యార్థ మేదో కాదు. ఈ ప్రత్యభిజ్ఞా దర్శనమే సుమా. దీన్ని ఎంతో గుప్తంగానూ ప్రకటంగానూ నిరూపిస్తూ వచ్చాను నా నాటకాలలో. చాలా జాగ్రత్తగా తడవి చూడండి మీకే చేతికి తగులుతుందా నిక్షేపమని ఈ నాందీ వ్యాజంతో చాటుతున్నాడు. మహా కవి వీటి ద్వారా చేసిన కావ్యార్ధ సూచన ఇది. ఇది మనకాయన మూడు నాటకాలలోనూ ఎంత కోరితే అంత పుష్కలంగా లభిస్తుంది. శ్రవ్యకావ్యాలు ఎన్ని రచించాడో దృశ్యాలు కూడా అన్నే రచించా డాయన. మాళవికాగ్నిమిత్రం - విక్రమోర్వశీయం - అభిజ్ఞాన శాకుంతలం. ఈ మూడు నాటకాలూ ఆయన ఈ ఆదర్శానికి మూడు అద్దాల మహళ్ళు. అన్నీ ఆయన ఆదర్శాన్ని బయటపెట్టే ఆదర్శాలే. అభిజ్ఞాన శాకుంతలంలో నైతే ప్రత్యభిజ్ఞానానికి ద్యోతకమైన అభిజ్ఞానమనే మాటే కంఠోక్తిగా బయటపెట్టాడు. నాటక మధ్యంలోకూడా అభిజ్ఞానమనే కాక - ప్రత్యభిజ్ఞానమని కూడా అప్రయత్నంగా నోటవచ్చిందా మహా కవికి. యదినామ స రాజా ప్రత్యభిజ్ఞాన మంథరో భవేత్ తత స్తస్యేద మాత్మనామ ధేయాంకితం అంగుళీయకం దర్శయ - అని అనసూయ నోట పలికిస్తాడు. ప్రత్యభిజ్ఞానం లేక మందకొడిగా మారితే ఆరాజు-నీవతనికీ ఉంగరం చూపు ఉదంతం జ్ఞప్తికి వస్తుందంటుందా చెలికత్తె శకుంతలతో. జరిగిన

Page 94

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు