రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కక్కడక్కడా వ్యంగ్య మర్యాదలో ఎన్నో సూచనలు చేస్తూ పోతాడు. ఇహ పరాలను రెంటినీ కలిపే ఆ ఏకైక సూత్రంలో మణులూ మాణిక్యాలలాగా ఆయా సన్నివేశాలూ పాత్రలూ వారి ప్రవృత్తులూ-మాటలూ చేష్టలూ ఒకటేమిటి. కావ్య సామగ్రిలో ప్రతి ఒక్క అంశాన్నీ సడలకుండా గుది గ్రుచ్చి ఒక చక్కని రత్నహారాన్ని తయారుచేసి సహృదయుల హృదయద్వారాన్ని అలంకరిస్తాడు. దానితో ఒక మహా పురుషుని జీవితం మాదిరే నాటక రచన కూడా ఒక మహోన్నతమైన విన్నాణంతో ప్రకాశిస్తుంది.
ఇదుగో ఇలాటి నానా విధ గుణగణోద్ఘాటకాలు కాళిదాస మహాకవి నాటకాలు. నవనవోద్భాసిత హాటకాలు కూడా. హేమ్న స్సంలక్ష్యతే హ్యగ్నౌ అని ఆయనే సెలవిచ్చినట్టు సహృదయులు తమ వివేచనాగ్నిలో ఎంత పుటం పెడితే అంతగా ప్రకాశిస్తాయి. అదే నవీనత అంటే. ఈ నవీనత ఏదోగాదు. 1 ఆయన కలవడిన ప్రత్యభిజ్ఞాదృష్టి అది మహాకవి శ్రవ్య కావ్యాలలో ఎలాగో దృశ్య కావ్యాలైన నాటకాలలో కూడా అలాగే రాశీ భూతమై కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ మోతాదు లోనే కనిపిస్తుంది. దుర్బలమైన పాఠకుని దృష్టికది నూటికి నూరిపాళ్ళూ అలా కనిపిస్తుందో లేదోనని ఆయనకే అనుమానం కాబోలు. తాను రచించిన మూడు నాటకాలకు వ్రాసిన మూడు నాందీ పద్యాలలోనూ భంగ్యంతరంగా దాన్ని బయట పెడుతూనే వచ్చాడు. మామూలుగా నాందీ పద్య మనేది ఏ నాటకంలో గానీ మూడు ప్రయోజనాలలో ఏదో ఒకటి సాధించటానికే ఉద్దిష్టం. ఆశీర్నమస్క్రియా వస్తు నిర్దేశ: అని ఆలంకారికులే సూత్రీకరించారు. ఆసూత్రాని కనుగుణంగానే నడిచాయి నాటకాలన్నీ. కాని కాళిదాసు రచించిన నాటక త్రయ మలా నడచి నట్టు కనిపించదు. వస్తు నిర్దేశం లేదందులో. నమస్క్రియా కాన రాదు. పోతే ఆశీస్సనేది కనిపిస్తుంది. కాని ఆ ఆశీస్సు ద్వారా మనా క్కావ్యార్థ సూచనం చేయ వలసి ఉంది కవి. భాస నాటకాదులలో కనిపిస్తుం దది. అలాటి కావ్యార్థ సూచన స్పర్శ కూడా లేదు. కాళిదాసు నాందీ పద్యాలలో. కేవలాశీర్వాద రూపమే. అందులోనూ అతి
Page 90