#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

కర్తలు. కాని ఒకే ఒక కేంద్రం చుట్టూ తిరిగే రేఖలలాగా ఒకదాని కొకటి అంటి పట్టుకొని అన్నీ కలిసి చివరకొకే కేంద్ర బిందువులో చేరిపోయి కవి ఆశించిన ఆదర్శాన్ని సహృదయుడిమనసులో బలంగా హత్తుకునే లాగా చేయటంలో కాళిదాసు కున్న నేర్పు మరెవరి లోనూ కాన రాదు.

  పోతే ఇక నాలుగవదీ అన్నిటికన్నా అపూర్వమైనదీ ఒకే ఒక మహా గుణముంది కాళిదాసు నాటక రచనలో. అది నాటక గమ్యం మీద ఆయనకున్న దృష్టి, ఈ దృష్టినే కావ్య ధ్వని అనీ కావ్యార్ధమనీ రకరకాలుగా వ్యవహరిస్తారు ఆలంకారికులు. కావ్య తత్త్వమన్నా ఇదే. వారు శ్రవ్యానికి చెప్పినా నాటకానికి కూడా ఆవశ్యక మది. జీవితానికి సాక్షాత్తూ ప్రతిరూపం కాబట్టి నాటకానికే ఇంకా ఎక్కువ అవసరం. ఒక గమ్య మనేది లేకపోతే అగమ్య మవుతుంది కావ్య సృష్టి, సత్య శివ సుందరాలనే త్రిపుటిలో సత్యం కావ్య వస్తువైతే సుందరం దాని రచన అయితే- శివం దాని గమ్యం లేదా లక్ష్యం. లక్ష్యమెప్పుడూ శివంగానే ఉండాలి. అశివం కారాదు. అది కావ్యాని కెలాగో నాటకానికీ అలాగే నని చెప్పాము. నాటకంలో ఈ శివం వైపు దృష్టి పోలేదు చాలా మంది రచయితలకు. కొద్ది మంది పెద్దలకు పోయినా అది ఎంత దూరం పోవాలో అంత దాకా పోయింది కాదు. మహా అయితే లోక నీతి- ధర్మ నిర్వహణా- ఇలాటి అవధుల వరకే సాగి అక్కడికే ఆగిపోయింది. భాస విశాఖదత్త భవభూతి శూద్రకాదుల బుద్దులు కూడా తావన్మాత్ర పర్యవసితాలే.

  కాగా కాళిదాస మహా కవి ఒక్కడే జీవితపు టెత్తూ లోతూ రెండూ కొలత వేసిన వాడు. ఆయన కిటు ఇహం మీదా ఉంది చూపు. అటు వరం మీదా ఉంది. పరిపూర్ణమైన మానవ జీవితాన్ని ప్రదర్శించా డాయన. ఎంత దర్శించాడో దాన్ని అలాగే ప్రదర్శించాడు. ఇందులో దర్శించటం మూలాన ఋషి అయితే ప్రదర్శించటం ద్వారా కవి అనిపించుకొన్నాడు. ఏ ఆదర్శం చూప దలచాడో అది కథావస్తువులో ఆద్యంతమూ పరచినట్టు బాగా పనగలిసి ఉంటుంది. పైగా అదే తన దృష్టి అని మన దృష్టిని దానిపై మళ్ళించటాని

Page 89

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు