#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

నాటక కళ ఎప్పటినుంచి మన దేశంలో చెలామణి అవుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. భారతీయ భాష అయిన సంస్కృతంలో ఇన్ని అన్ని కావు. పరశ్శతంగా రచించారు కవులు నాటకాలను.

  అయితే అన్నీ ఒక ఎత్తు. మహా కవి కాళిదాసు రచించిన నాటకాలొక ఎత్తు. ఆయన కావ్యాలూ రచించాడు. నాటకాలూ రచించాడు. ఇలా శ్రవ్య దృశ్య కావ్యాలు రెండింటినీ సవ్యసాచిలాగా నిర్వహించిన కవి మరొకడు మన సాహిత్యంలో లేడేమో కూడా. వ్రాస్తే నాటకాలైనా వ్రాశారు. లేకుంటే కావ్యాలైనా వ్రాశారు. రెండూ వ్రాసిన కీర్తి కాళిదాసు దొక్కడిదే. అంతే గాదు. మిగతా వాళ్ళు నాటకాలు వ్రాసినా అవి కావ్యాల లాగే కనిపిస్తాయి. నాటకాభాసలే గాని నిజానికవి వాటకాలు కావు. ఒక అనర రాఘవమూ మాలతీ మాధవమూ మహా వీర చరితమూ ఉత్తర రామ చరితమూ- ఇలాటి వేవి చూచినా మనకు తార్కాణ మవుతుంది. గొప్ప భావుకత్వమున్న కవులే వారందరూ. కాని వారు నాటక మనుకొంటూ కావ్యం వ్రాసి కూచున్నారు. మరి నాటకంగానే తీర్చి దిద్దిన వారూ కొందరు లేకపోలేదు. శూద్రకుని మృచ్ఛకటిక మైతేనేమి. విశాఖ దత్తుని ముద్రా రాక్షస మైతేనేమి. నాటక శిల్ప ముట్టిపడే రచనలు. సందేహం లేదు. కాని అవి తావన్మాత్ర పర్యవ సాయులే. అంతకు మించిన కశాదృష్టి అనే విశిష్ట ప్రయోజన మందులో లేదు. పోతే భాస మహా కవి నాటకా లున్నాయి. కాళిదాసు కన్నా ముందు వ్రాసిన వవి. చాలా ఉదాత్తమైన నాటకాలనటంలో ఎలాటి విప్రతిపత్తీ లేదు. నాటకాని కుండవలసిన లక్షణాలన్నీ కనిపిస్తాయి. కాని లోతుకు దిగి చూస్తే వాటిలో కూడా ఒక వెలితి కనిపిస్తుంది. ఉండ వలసినంత సరసతా నిలకడా నిండుదనమూ కానరావు. ఎవరో తరుముకు వచ్చినట్టు పరుగెడు తుంటాయవి. భావతీవ్రత కున్న స్థానం స్తిమితతకు లేదు. ధర్మ పరత్వం మీద ఉన్న దృష్టి రచయితకు సరసత మీద లేదు. ఉదాత్తతతో పాటు ఉజ్జ్వలతకు స్వాగతం పలకలేదని తోస్తుంది మనకు.

Page 84

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు