స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
అర్ధమే. శాకుంతలంలో దుష్యంతుడు ప్రజాః ప్రజాః స్వా ఇవ పాలయిత్వా ప్రజలను ప్రజలలాగే పాలించేవాడట. ఒక సత్యాన్ని ఎంత సత్యంగా చెప్పాడు. ఎంత ప్రియంగా చెప్పాడు మహాకవి.
ఇది కాళిదాసు జీవించిన రాజకీయ వాతావరణం. ఇదీ ఆనాటి లోక వ్యవస్థ . ఇలాంటి వ్యవస్థ ఆయన కెంత స్ఫూర్తి నిచ్చి ఉంటుందో ఆలోచించండి. భోగభాగ్యాలతో తులతూగే కాలమది. కాని చిత్రమేమంటే ఎంత భోగ లాలసులో వారంత త్యాగశీలురు. ఇహం మీద ఎంత దృష్టో పరం మీదా అంతే దృష్టి వారికి అంతే కాదు. భౌతికావసరా లయిన అన్న పాన వసన వసనాదులను అనుభవిస్తూ అక్కడికే నిలిచి పోయిన జాతి కాదు అప్పటి జాతి. వైజ్ఞానికంగా కూడా ఎంతో ఎత్తుల కెదిగిన జాతి. అప్పుడే అది స్వర్ణ యుగ మనిపించు కొంటుంది. లేకుంటే లోహ యుగమో లోష్ట యుగమో అయి ఉండేది. విజ్ఞానమంటే దాని కిదంత లేదు ఇయత్త లేదు. శ్రుతులు స్మృతులు ఇతిహాసాలు పురాణాలు- ఒకటేమిటి సమస్త విద్యలు సకల కళలు అభ్యసించా రప్పటి మేధావులు. లోకమే గాక శాస్త్ర కావ్యాదులు కాడా అవేక్షణ చేస్తేనే గదా అది సమగ్రమైన వ్యుత్పత్తి. అందులో శాస్త్రాదుల లంటే చతుర్దశ విద్యలు . కావ్యాదులంటే చతుష్షష్టి కళలని ఆది శబ్దమే మనకు సూచిస్తున్నది. కాళిదాసు కటు వేద వేదాంగాలలో ఎలాంటి అభినివేశమో విద్యలూ కళలలో కూడా అలాటి అభినివేశమే ఉంది. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః అని అమ్మవారి విద్యలను వర్ణించినా ఆయన కుమార సంభవంలో -అది అమ్మవారికి సంక్రమించిన విద్యలని తోచదు నాకు. కాళిదాసుకు సంక్రమించిన అతని ప్రాక్తన విద్యా వైభవమే. దిలీపుడి లాగా వాటినే బహుముఖంగా వికసింప జేసుకొని బహుశ్రుతుడై ఉంటాడాయన. విద్యానాం పార దృశ్వనః - తస్య ధర్మ రతే రాసీత్ వృద్ధత్వం జరసా వినా. అన్ని విద్యల ఆవలి తీరం చూచి చూచి ఆదిలీపుడు జర లేకుండానే వృద్ధుడ య్యాడట.
Page 8