రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
వివేక విశ్రాంత మభిహితం. పూరాణ మిత్యేవ న సాధు సర్వం- నచాపి కావ్యం నవ మిత్యవద్యం. ప్రాతదైన మాత్రాన బంగారం కాదు. క్రొత్తదని చెప్పి త్రోసి. వేయ వలసింది కాదు. గుణ దోషాలు వివేచన చేసి ఏది మంచో అది పరిగ్రహిస్తారు పెద్దలు. అవివేకులైన వారొకరు చెప్పిందే వేదమని గొట్టె దాటుగా వెళ్ళి పోతారు.
ఇక్కడ నవమితి అనటంలో తన ఈ తొలి రచన కూడా విలక్షణ మయినదే నని చాటుతున్నాడు కవి. నవమంటే క్రొత్తదని కూడా కాదు మహాకవి భావం. మిగతా వారి రచన లన్నిటికన్నా విలక్షణ మైన రచన అని. కేవలం క్రొత్తదనే అభిప్రాయమే అయితే అప్పుడే క్రొత్తగా వ్రాసింది మాళవికాగ్ని మిత్రం. కాబట్టి దానిని నవమంటే అనవచ్చు. ఆ తర్వాత వెలువడిన విక్రమోర్వ శీయాన్ని - నిర్భర వయః పరిపాకంలో రచించిన శాకుంతలాన్ని కూడా నవమని పేర్కొనటంలో అర్ధంలేదు. మరి వాటిని సైత మలా నిర్దేశించా డంటే అప్పటికి నవమనే మాట ఆయన అపూర్వం అనితర సాధారణ మనే దృష్టిలో ప్రయోగించాడని గ్రహించాలి మనం. ఇది తన నాటకాలలోనే వాడిన మాట అయినా నాటక మాత్ర పర్యవసితం కాదాయన దృష్టిలో. నాటకాలకే గాక శ్రవ్య కావ్యాలుగా రచించిన రఘువంశాది రచనలకు కూడా వర్తిస్తుంది. నచాపి కావ్యమని గదా నిర్దేశించాడాయన. కావ్య మన్నాడే గాని నాటక మనలేదు. కావ్యమంటే అది దృశ్య శ్రవ్య సాధారణ మయిన మాట. తన రెండు విధములైన రచనలూ విలక్షణ మైనవే సుమా అని భావుక లోకాన్ని హెచ్చరించటానికే నాటకంలో కావ్యమనే శబ్ద మాయన ప్రయోగించింది. విక్రమోర్వశీయంలో నైతే క్రియా మిమాం అని క్రియా శబ్దాన్నే ప్రయోగించాడు కాళిదాసు. క్రియా కృతి -ప్రబంధ మంటే పని తనమూ కూర్పూ నని అర్థం. ఏదైనా పనితనమే. ఏదైనా కూర్పే. శ్రవ్యమైనా కావచ్చునది. దృశ్యమైనా కావచ్చు. పనితనమై ఉండాలది -చక్కని కూర్పయి ఉండాలని కవి ఆశయం. కాబట్టి కాళిదాసు చూపిన నవీనత ఆయన రచన లన్నింటిలోనూ పన గలిసిన గుణం.
Page 57