#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పార్వతీ పరమేశ్వరులైతే వాఙ్మయ జగత్తుకవి వాగర్థాలు. దానికి వారు జననీ జనకులైతే దీనికి వాగార్థాలే జననీ జనకులు. అసలైన అర్ధాన్ని అసలైన వాక్కుతో అన్వేషించి పట్టుకోవటమే వాగర్థ ప్రతిపత్తి. అది తప్పకుండా శివానికి దారి తీస్తుంది. అదే కావ్యార్థం కాళిదాసు దృష్టిలో.

  పరమార్థమే కావ్యార్థమైతే దాని నందుకోటానికి విస్తరించిన వాగ్వభూతే ఆయన కావ్య నాటక నిర్మాణ మంతా. నా సుందరమైన ఈ వాగ్వభూతి ద్వారా ప్రతీయమాన మౌతున్న ఆ ఏకైక సత్యాన్ని అనుభవానికి తెచ్చుకొని అందులో ఈ సౌందర్యాన్ని ప్రవిలయం చేసుకొని అఖండమైన ఆత్మ స్వరూపంగా దాన్ని పునః పునః అనుసంధానం చేసుకొని ఆనందించమనే ఆయన సందేశం. ఆయన రచనల ద్వారా సహృదయులకు కలగవలసిన ప్రత్యభిజ్ఞ కూడా ఇదే. అది మొదట కవి భావించి సృష్టిస్తేనే సహృదయుడి దృష్టికి వస్తుంది. కవి దృష్టిలో లేనిది మన దృష్టికి రావట మసంభవం. అతిలోకమైన ఇలాటి ప్రత్యభిజ్ఞ కాళిదాసు కాయన అదృష్టం కొద్దీ బహు జన్మార్జిత సంస్కార ఫలంగా ఉదయించింది. అది అపూర్వ వస్తు నిర్మాణ క్షమమైన అతని ప్రతిభగా పరిణమించింది. ఇలాంటి ప్రతిభ ఇతర కవుల కుండాలంటే మరి ఎలా ఉండగలదు. వారిలాటి ప్రత్యభిజ్ఞా హృదయాన్ని హృదయంగమం చేసుకొన్న వారైతే గదా. అంతకు ముందున్న కవులూ ఎరుగరది. తరువాతి వారూ ఎరుగరు. సర్వాతి శాయిని అయిన దృష్టి అది. దానికీ సృష్టి అంతా త్రిపుర సుందరీ విలాస మైతే ఇది ద్యోతనం చేసే సృష్టి కర్త ఆ త్రిపురాంతకుడే. వారిరువురే ఆయన సాహిత్య ప్రపంచమంతా పరుచుకొన్న వాగర్థ సామరస్యం. శివశక్తి సామరస్యం. దాని ద్వారా ఆయన ఆసించిందీ -లోకుల కుపదేశించిందీ జీవ బ్రహ్మైక్య రూపమైన ప్రత్యభిజ్ఞే. దీన్ని తానందుకోటానికి మనకందివ్వటానికి ఆయన తన ప్రతిభనంతా వినియోగించి మూడు నాటకాలూ మూడూ కావ్యాలూ రచించాడు. ఆ ప్రతిభకు సహచారులు గానే తన వ్యుత్పత్త్యభ్యాసాలు రెండూ ధారపోశాడు. వాక్కును

Page 54

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు