స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
చేయని సువర్ణం. కాబట్టి సత్య సుందరాలు రెండూ కలిసి ఓత ప్రోతమై
ఇది గ్రహించిన మహానుభావుడు కాళిదాసు. ఆయన ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని సాహిత్యాని కద్భుతంగా అన్వయించాడు. అధ్యాత్మ రంగంలో ఏవి శివశక్తులో అవి సాహిత్య రంగంలో వాగర్థాలే. పార్వతీ పరమేశ్వరు లాయనకు వాగార్థాల లాగే కనిపించారు. వాగార్థా వివ సంపృక్తా ఏవో కావవి. సత్య సౌందర్యాలే. సత్యం శివ స్వరూపమైన అర్థం. వాక్కు సౌందర్య రూపమైన శక్తి. పరా రూపమైన శక్తే గదా వైఖరీ రూపమైన ఈ చరాచర ప్రపంచం. ఇది ఆ పరమాత్మ విభూతే గదా. ఇదే సుందరి. అధిభూతాధ్యాత్మ ధి దైవ రూపంగా వ్యాపించిన త్రిపుర సుందరి. ఈ సుందరి ఆ అర్ధాన్ని వచించే వాక్కు. ఈ వాక్కునే ఆలంబనం చేసుకొని ఆ పరమార్థాన్ని వెదకి పట్టుకోవాలి సాధకుడు. అప్పుడే జీవిత గమ్యమైన నిశ్రేయసాన్ని అందుకోగలం . అదే మనకు శివం. శివమైన గమ్యాన్ని చేరాలంటే అప్పటికీ సత్య సౌందర్యాల రెండింటి సామరస్యాన్నీ భావన చేయాలి మనం. సౌందర్య రూపమైన వాక్కు ద్వారా సత్య రూపమైన అర్థాన్ని భావిస్తూ పోవాలి. అవి ఈ భౌతిక జగత్తు నెలా పాలిస్తున్నవో భావ జగత్తును కూడా అలాగే ఏలుతున్నాయి. స్వరూప విభూతులవి. స్వరూప విభూతులను విడిచి సృష్టే లేదు గనుక భౌతిక జగత్తు కవి మాతా పితరులు. జగ తః పితరౌ వందే అని కవి ఆక్రందన చేశాడంటే దాని అర్థమిదే. భౌతిక సృష్టికంతా జననీ జనకులు పార్వతీ పరమేశ్వరులే. పార్వతి అంటే వాక్కు. అది మరలా సౌందర్యానికి ప్రతీకే. అలాగే పరమేశ్వరుడంటే తద్వారా అన్వేషించ వలసిన స్వరూప భూతమైన అర్థం. అది మరలా సత్యానికి ప్రతీక. వీరిరువురి సామరస్యాన్ని అనగా సత్య సౌందర్యాలను రెంటినీ కలిపి భావస్తే మనకు లభించేది చివరకు శవమైన మోక్షమే. సత్వం సుందరం శివం. ఆధ్యాత్మిక జగత్తుకు సత్య సుందరాలు
Page 53