స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆమాటకు వస్తే పురాణ మిత్యేవ నసాధు సర్వం - నచాపి కావ్యం నవ మిత్యవద్యం అని చాటటంలో కూడా పురాణ మనే మాట ప్రాతదని కాక పురాణ వాఙ్మయానికి - కావ్యమనే మాట కావ్యవాఙ్మయానికి స్పోరకంగానే వాడినట్టు భాసిస్తుంది నాకు.
ఈ విధంగా కాళిదాసీయమైన ముద్ర శ్రవ్యకావ్యాల లోనే కాదు. దృశ్యకావ్యాలుగా రచించిన ఆయన శాకుంతలాది నాటకాలలోనూ కనిపిస్తుంది. కావ్య నిర్మా ణంలో ఆయనకు వాల్మీకి గురువయితే నాటక శిల్పంలో భాసుడు మార్గదర్శకుడు. భాస నాటకాల నెంత జా గ్రత్తగానో పరిశీలించాడు కాళిదాసు. నాటకాంతంహి సాహిత్య మన్నారు. కావ్యం వ్రాయటం వేరు. నాటకం వ్రాయటం వేరు. నాటకం వ్రాసి మెప్పించట మసాధ్యం. దాని కితివృత్త మెలాంటిది తీసుకోవాలి - దానిలో ఎలాటి మార్పులు చేయాలి. ఎన్ని అంకాలుగా విభజించు కోవాలి ఎక్కడ ఎంత పైకి చెప్పాలో 50నర్పకుండా ఎంత పాఠకుడి ఊహకు వదిలేయాలి ముందు ఏమి జరగ బోతుందో ననే కుతూహల మెలా పెంచుతూ పోవాలి ముందు వెనుకలు కథలో ఎలా కలుపుకొంటూ పోవాలి ఎప్పుడేది ఎలా పరామర్శించాలి - ఏది చెప్పినా దానికి కథలో ఎలాటి స్థానముండాలి - అన్నీ కలిసి చివరకొకే గమ్యం వైపు ఎలా పయనించాలి - ఇలాటి నాటక శిల్ప సూత్రాలన్నీ భాసుడనే సూత్రధారుడి వల్లనే గ్రహించాడు కాళిదాసు. ఇంతేకాదు. సంభాషణ లెక్కడ ఎంత మోతాదులో ఉండాలి ఎంత సరళ సుందరంగా ఉండాలి - మాటకు మాట ఎంత పొందికతో సాగాలి ఇది కూడా భాసుడు నేర్పిన కళే కాళిదాసుకు. కాగా వర్ణనలనేవి కథా గమనానికి భంగకరం కాకుండా ఎక్కడ ఎంతమాత్రం చేస్తూ పోవాలో ఇది కథా ఇది వర్ణనా అనిపించ కుండా ఎలా కలిసి ప్రవహించాలో కూడా ఆయన గారి శిక్షణే. తుదకు పద్యాలను కూడా ఎక్కడ ఎన్ని వ్రాయాలో వాటి సంఖ్య కూడా నిర్ణయించి ఆయనకు బోధించిన వాడు భాసుడే. మొత్తంమీద ఊరక చదువు కోటానికి గాదు నాటకమంటే -
Page 50