స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
గుప్తుల కాలంలోని వాడే కాళిదాసన్నందు కసలు చరిత్ర వరకూ పోనక్కర లేదు. ఆయన కావ్యాలలోనే అంతర్గతమైన ప్రమాణ మెంతో కనిపిస్తుంది మనకు. రఘు వంశ మనే మహాకావ్య మాయన వ్రాశాడంటే అది చాలా వరకు గుప్త రాజ వంశాన్ని మనసులో పెట్టుకొనే వ్రాశాడని నా అభిప్రాయం. దిలీపుడు, రఘువు, అజుడు వీరు చంద్రగుప్త సముద్ర గుప్త కుమార గుప్తులే. సందేహం లేదు. వారిని వర్ణించేటపు డలాగే సూచిస్తూ వచ్చాడు కవి. దిలీప ఇతి రాజేందు - రిందుః క్షీర నిధా వివ - నవోదయం చంద్ర మివ అని ఇలా చంద్రుడితో పోల్చి వర్ణిస్తాడు దిలీపుణ్ణి. మరి రఘుమహారాజు నైతే నదీ ముఖేనేవ సముద్ర మా విశత్తని సముద్రంతో పోల్చి వర్ణిస్తాడు. పోతే బ్రా హ్మే ముహూర్తే కిల తస్య దేవీ- కుమార కల్పం సుషువే కుమారమని అజమహారాజును కుమార స్వామితో పోల్చి చెబుతాడు. చంద్ర సముద్ర కుమార నామాలను పేర్కొనటంలో భంగ్యంతరంగా చంద్రగుప్త సముద్ర గుప్త కుమార గుప్తులనే ధ్వనింప జేస్తున్నాడు. చరిత్ర కాదు గదా. ఇది కావ్యం. అంచేత సూటిగా గాక చాటుగా సూచిస్తున్నాడు తన భావాన్ని కవి కావ్య మార్గంలో. తన అభ్యుదయానికి కారకులయిన ఆ రాజులంటే ఆయన కంత గౌరవం. ఆ గౌరవంతోనే వారి గొప్ప తనాన్ని కావ్య రూపంగా కొనియాడి వారి పేరు చిరస్థాయి గావించాడు. ఆ అభిమానంతోనే అడపా దడపా ఆ వంశీయు లందరికీ సాధారణమైన గుప్త శబ్దాన్ని పేర్కొంటూ వచ్చాడు. కుబేర గుప్తాం దిశ ముష్టష్ఠ రశ్మా తస్మిన్ వనం గోప్తరి గాహమానే జుగోపాత్మాన మత్రస్తః - అని ఇలా గుప్త శబ్దాన్ని అనేక రూపాలలో ఉదాహరిస్తాడు. అంతేగాక రఘు మహారాజు జీవితాన్ని ఆయన దండయాత్రను - చివర కాయన నిర్యాణాన్నీ మిగతా రఘవంశ రాజు లెవరికీ వర్ణించనంత సమగ్రంగా వర్ణించాడు కావ్యంలో. అసలు రవి వంశమని గాక రఘు వంశమని కావ్యానికి నామ కరణం చేయటంలోనే కనిపిస్తుంది ఆ మహారాజు కాయన ఇచ్చిన ప్రాధాన్యం. చరిత్ర చదివితే నిజంగా సము ద్రగుప్తు డిలాటివాడే. ఉత్తరమే గాక దక్షిణానికి కూడా
Page 5