#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

చెప్పేమాట. తొమ్మిది మంది కవులే కానక్కర లేదు. ఒక్కొక్క డొక్కొక్క శాస్త్రంలోనో కళలోనో ప్రవీణుడై ఉండవచ్చు. ఘట కర్ప రాదు లాయా శాస్త్రాలలో నయితే - కాళిదాసు కవితా కళలో సానదీరిన జాతి రత్న మయి ఉంటాడు . అసలు రాజైన వాడు సమర్థుడయి ప్రజాను రంజకంగా రాజ్యం చేసినప్పుడే దేశంలో ఒక ప్రశాంతమయిన వాతావరణ మేర్పడేది. అది ఏర్పడితేనే అన్ని విద్యలకు కళలకు అభ్యుదయ మనేది ఇది పాశ్చాత్య దేశాలలో ఎలిజ బెత్తు కాలంలో విన్నాము. వచ్చీ పోయి అదే కాలానికి చెందిన మన దేశంలో కృష్ణ రాయల పాలనలో విన్నాము. ప్రస్తుతమీ గుప్త రాజుల కాలం కూడా అలాంటిదే. సుభిక్షంగా ఉన్నదప్పుడు దేశం. సుఖ శాంతి మయంగా ఉంది. అందుకే కాళిదాసు లాంటి మహా కవు లవతరించారు. మహా కావ్య సృష్టి చేయగలిగారు. రాజ ధాని ఉజ్జయిని లోనే నివసించా డాయన. స్వస్థాన వేష భాషాభిమతాః అన్నట్టు స్వస్థాన మంటే ఎనలేని అభిమాన మాయనకు. అందుకే నేమో వక్రః పంథా యదవ భవతః ప్రస్థితస్యోత్తరాశాం సౌధోత్సంగ ప్రణయ విముఖో మాస్మభూ రుజ్జయిన్యాః అని కీర్తిస్తాడు మేఘ సందేశంలో. తనకే గాదు ఉజ్జయిని సౌధోత్సంగ సుఖం. మేఘుడికి కూడా సంక్రమిస్తే బాగుండునని ఆయన ఆశ. ఉజ్జయిని ఆయన దృష్టికొక ప్రణయిని. విడ రాని బంధం దానితో ఆ కవికున్న ప్రణయ బంధం. విధివశాత్తూ దానికి దూరమయినా దాని సౌభాగ్యాన్ని తలచుకొని కలవరిస్తున్నాడు. అసలు జీవితంలో అతడలా దూరం కావలసి వచ్చిందనే చారిత్రకులు చెబుతున్నారు కూడా. ఆంధ్ర చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి ఆయనను తన రాజ్యాని కరణంగా తెచ్చుకొన్నాడని ప్రతీతి. తదీయ జ్ఞాపకార్ధమే గౌతమీ అనే స్త్రీ పాత్ర నొకటి శాకుంతలంలో కల్పించాడని - స్వదేశ వియోగం భరించ లేకనే యక్షుడి మీద నెపం పెట్టి తానే కథా నాయకుడిగా మేఘదూతం రచించాడని చెబుతారు.

Page 4

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు