#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పోయింది. ఇలా భావిస్తూ పోతే ఎన్నో ఉన్నాయి రామాయణ సన్నివేశాలతో కాళిదాసు కావ్యాలకు సాదృశ్యాలు.

  సన్నివేశాలేమిటి. వర్ణనలు చూస్తే మతి పోతుంది మనకు. అష్టా దశ వర్ణనలూ చేశాడు వాల్మీకి. అదీ తెచ్చి పెట్టు కొన్నట్టు గాక సందర్భాను గుణంగానే సాగింది ప్రతి వర్ణనా. అలాగే కాళిదాసు కావ్యాల్లో కూడా సాగుతుంది. వాల్మీకి ఒక పర్వతాన్ని వర్ణించాడంటే అది సందర్భోచితం. హనుమంతుడు మహేంద్ర పర్వతం మీది నుంచి సముద్ర లంఘనం చేశాడు. మరలా వచ్చి ఆ పర్వతం మీదనే వాలాడు. చేసి తీరాలి పర్వత వర్ణన. అలాగే సముద్రం లంఘించాడంటే సముద్ర వర్ణన తప్పదు. లంకలో ప్రతి సందు గొంది మేడ వాడ గాలించాడంటే పట్టణ వర్ణనా చేయవలసిందే. అలాగే కుమార సంభవంలో హిమవత్పర్వతాన్ని వర్ణించాడంటే కవి - అది ఎంతైనా సమంజసం. రఘువంశంలో పుష్పకంలో తిరిగి వచ్చేటపుడు ఆయా పట్టణాలు నదులు సముద్రాలు వర్ణించాడంటే అదీ అలాంటిదే. పోతే ఇవన్నీ ఒక ఎత్తైతే ఋతువర్ణన ఒక ఎత్తు. వాల్మీకికి కిష్కింధలో సమయం దొరికింది ఆయా ఋతువులను వర్ణించటానికి. అంతవర కెక్కడా లేదు. అరణ్యలో మాత్రం హేమంత శిశిరాలను వర్ణించాడు. కిష్కింధలో వర్ష శరత్తులను వర్ణించాడు. పోతే సుందరలో వసంతాన్ని బ్రహ్మాండంగా వర్ణిస్తాడు అన్నీ సందర్భోచితమే. రాముని విరహ దశలో జరిగిపోయాయి చాలా వరకు. మరి ఆ వర్ణన లంటారా అవి అతి లోకం. ఎంత అతిలోక మంటే కాళిదాసు వాటికి మంత్రముగ్ధుడై మరలా పనిగట్టుకొని ఒక ఖండకావ్యమే వ్రాశాడు ఋతు సంహారమని. అది ఆయా దేశభాషలలో ఎన్నో ఋతుసంహారాల విహారానికి దారి చూపింది. అసలు రఘువంశంలో వసంత గ్రీష్మాలకూ కుమార సంభవంలో అకాల వసంతానికీ - తరువాత అమ్మవారి తపశ్చర్యలో గ్రీష్మ వర్ష శిశిర హేమంతాలకూ ఎంతో అవకాశం లభించింది కవి విశృంఖలంగా వర్ణన సాగించటానికి. ఇదంతా వాల్మీకి మహర్షి చలువే. అంతేకాదు. ఈ వర్ణనలలో కూడా చేతన వర్ణనలో

Page 44

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు