#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  ఒక పేర్లనే కాదు. ముందు పేర్కొన్నట్టు వాల్మీకి కవితా భాండాగారాని కంతటికీ సర్వాధికారి అయ్యాడు కాళిదాసు. ఆయా సన్ని వేశాలే కాదు. వర్ణనలే కాదు. భావాలే కాదు. పద బంధాలే కాదు. సమాసాలే కాదు. రచనా శిల్పమే కాదు. ఆఖరుకు రసోచిత వర్ణ విన్యాసమే కాదు. తుడుము మొదలు దేవతార్చన వరకూ ఆ మహనీయుని అడుగులో అడుగు వేస్తూ నడచిన వాడే కాళిదాసు. దానికి తార్కాణాలు కో కొల్లలు. కథా సన్ని వేశానికి శాకుంతలమే తీసుకొని చూడండి. ఒక మహర్షి పాలనలో పెరిగి ఆయన అనుమోదంతో దుష్యంతుణ్ణి చెట్ట పట్టింది శకుంతల. మధ్యలో ఆయనకు దూరమయి పోయి మరలా ఇంకొక మహర్షి అను గ్రహంతో తన భర్తను కలుసుకో గలిగింది. కణ్వ మహర్షి పెంచితేనే గదా పెరిగిందావిడ. మరలా కశ్యపు డప్పగిస్తేనే గదా దుష్యంతుని పడయ గలిగింది. ఆలోచిస్తే ఇది సరిగా సీతా వృత్తాంతానికి సరి పడే సన్ని వేశం. విశ్వా మిత్రుడి ధర్మమా అని రాముడు మిధిలకు వచ్చి శివ ధనుర్భంగం చేస్తే రాముని పెండ్లాడ గలిగిందావిడ. విధివశాత్తూ భర్తకు దూరమై చివరకు వాల్మీకి మహర్షి తెచ్చి అప్పగిస్తే భర్త దర్శనానికి నోచుకొన్నది. అంతే కాదు. సీత వియోగం భరించ లేక భూమాతను తనలో కలుపు కొమ్మని అడిగినట్టే శకుంతల కూడా బ్రతిమాలుతుంది భగవతి వసుంధరే దేహి మే వివరం అని. కుశలవుల ద్వారా ఆవిడ భర్తృ వృత్తాంతం తెలుసుకొన్నట్టే భరతుని ద్వారా శకుంతలా గ్రహిస్తుంది దుష్యంతుడు తన్ను సమీపించాడని.

  కుమార సంభవంలో కూడా ఇలాటి సంవాదమే మనకు సాక్షాత్కరిస్తుంది. సీత పూర్వ జన్మలో వేదవతి. అలాగే పార్వతి సతీ దేవి. వేదవతి అగ్నిలో దగ్ధమయి తరువాత సీతగా జన్మించింది. సతి యోగాగ్నిలో భస్మమయి మరలా పార్వతిగా ఉదయించింది. ఆవిడ తాను కోరిన విష్ణువునే రాముని రూపంలో వరించింది. ఈవిడ తాను కోరిన ఈశ్వరుణ్ణి తాపసిగా కాక శృంగార పురుషునిగా చూచి పెండ్లాడింది. ఆవిడ దక్షుడి శివదూషణ వినలేక పోయినట్టే ఈవిడా బ్రహ్మ చారి చేసిన పతి దూషణ సహించలేక

Page 43

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు