#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

దర్శయిష్యంతం - క్రియా సంక్రాంతి మాత్మనః. ఒక సందర్భమేర్పడినప్పుడు మనకున్న విద్య ప్రదర్శించ లేకపోతే అది ఉండి కూడా ఉపయోగం లేనిదేనట. ఇలాటి విసురులెన్నో విసురుతా డక్కడక్కడా తన రచనలలో మహాకవి. వాటన్నిటి సారాంశమూ ఒక్కటే. ప్రతిభా వ్యుత్పత్తులు కవి పోగు చేసుకొన్న సరకూ సరంజామైతే దానికి వినియోగ మభ్యాస పాటవం.

  అయితే ఇందులో ఒక సూక్ష్మ మున్నది. అభ్యాస మొకరి వల్ల ముందు శిక్షణ పొందాలి. ఆ తరువాత దాన్ని పునః పునః కృషిచేసి పాటుకు తెచ్చుకోవాలి. అలా శిక్షణ నందివ్వ గల పెద్దలకే తదులని పేరు. తజ్ఞులంటే దాని సంగతి బాగా తెలిసిన వారు ఆ విద్యను బాగా జీర్ణించు కొన్న వారని అర్థం. అలాటి పూర్ణ పురుషుల దగ్గర శిక్షణ పొందినప్పుడే అది సరియైన మార్గం. దీనినే ఆగమమని సంప్రదాయమని పేర్కొంటారు. ప్రతి విద్యకూ ఉంటుందిలాంటి సంప్రదాయం. సంగీతాని కేమిటి- సాహిత్యానికేమిటి. అన్ని కళలకూ అలాటి సంప్రదాయ ముండితీరాలి. అప్పుడే అది దారి తప్పకుండా ఒడుదుడుకులు లేకుండా ముందుకు సాగిపోతుంది. లక్ష్యాన్ని సాధిస్తుంది. లేకుంటే అడ్డదిడ్డంగా పయనించి అగమ్యంగా పరిణమిస్తుంది. కనుకనే మమ్మటుడు కావ్యజ్ఞ శిక్షయా భ్యాసః అని వాక్రుచ్చింది. కావ్యజ్ఞుడంటే కావ్యమంటే ఏమిటో తెలిసిన వాడు. కావ్యార్థ తత్త్వజ్ఞుడని ధ్వని కారుడు దీన్నే ప్రపంచనం చేశాడు. కావ్యం కాదు. కావ్యార్ధమూ కాదు. దానితత్త్వ మొకటి ఉంటుంది. దాన్ని భేదించి పట్టుకొన్న వాడెవడో వాడు కావ్యజ్ఞుడు. అలాంటి పెద్దలే మనకు మార్గం చూపగలరు. స్వయం తీర్థః పరాం స్తారయతి అన్నారు. వాడుత్తీర్ణుడై ఆ విద్యలో మరొకడిని ఉత్తీర్ణుణ్ణి చేయాలి. అలాటి వారినే తీర్థంకరు లంటారు.

  అలా ఉత్తీర్ణులయిన కవితా తీర్థంకరుల దగ్గరే బహు కాలం కృషి చేశాడు కాళిదాసు. సమకాలికులైన గురువు లెవరో మనకు తెలియదు గాని అతనికి పూర్వకాలికు లయిన సాహిత్యాచార్యులు మాత్ర మిద్దరు ముగ్గురే.

Page 40

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు