స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పోయాడు. ఉద్బాహురివ వామనః అని ఆయనే చెప్పినట్టు వామనుడు త్రివిక్రము డయినాడు. శివైక దృష్టి అద్వైత దృష్టిగా మారాడు. ఆ దృష్టితో చూస్తే అతనికి శివుడేమిటి విష్ణువేమిటి బ్రహ్మ ఏమిటి. అఖరుకు ఆది శక్తి అయిన అమ్మవా రేమిటి. అందరూ ఏకంగానే కనిపించారు. స్త్రీపుంసా వాత్మ భాగౌ తే. స్త్రీ పురుషులనే తత్త్వాలు రెండూ రెండుగా మారిన ఆత్మ భాగాలే. ఆ ఆత్మ సంవిద్రూపంగా కేవలమే ననే రహస్యం తెలుసుకొన్నాడు. అయితే అంతకు ముందే తన జీవితంతో పెనవేసుకొన్న శివదృష్టి పూర్తిగా వదల లేదు. జీవన్ముక్తుడికి ప్రారబ్దం లాగా ఇంకా కొంచె మంటు కొని ఉన్నది. అలా అంటుకోవటం వల్లనే కాబోలు తన రచనలలో అద్వైత భావ మెంత ప్రదర్శిస్తున్నా అక్కడక్కడ సమయం వచ్చినప్పుడల్లా అది కొంచెం తొంగి చూస్తూనే ఉంటుంది. మాతృభి రాదృతాభిః - న్యస్తం పురస్తాత్ పుర శాస నస్య - తద్గారవా న్మంగళ మండన శ్రీః అని ఈశ్వరుడి పరివారమైన బ్రాహ్మ్యది సప్త మాతృ- కలనూ ఆయన వివాహ మహోత్సవంలో స్మరించక తప్పలేదాయనకు. అలాగే తాసాంచ పశ్చాత్ కనక ప్రభాణాం - కాళీ కపాలా భరణా చకాశే అని అంతవరకూ తనకిష్ట దేవత అయిన కాళీ మాతాను కూడా భక్తి పూర్వకంగా భావించకుండా ఉండ లేక పోయాడు. కానీ ఇలాంటి వన్నీ ప్రస్తావోచితంగా చేసిన వర్ణనలే గాని కేవల శైవాభిమానంతో చేసినవి కావు. ఆవగింజంత బూది మై నలది కొనిన వెలది గుమ్మడి కాయంత వెట్టి పుట్టు ననే శ్రీ నాధోక్తికి గురి అయ్యేంత మతోన్మాది కాడు కాళిదాసు.
కనుకనే కేవల శైవాన్ని కాక అద్వైత దృష్టితో శైవాన్ని చూచి సమన్వయించుకొన్నాడు. ఈ సమన్వయ దృష్టితోనే శివాద్వైతి అయ్యాడాయన. అంతకుముందున్న శివాద్వైతుల దర్శనాన్ని పరిశీలించటం వల్లనో లేక తనకు సమకాలికు లైన అలాంటి కొందరు దార్శనికుల తోడి సాహచర్యం వల్లనో శివాద్వైతుల సమన్వయ మార్గ మాయనకు బాగా వచ్చి ఉంటుంది. కాని దానిని కూడా ఆయన సక్తుమివ తిత ఉనా అన్నట్టు బాగా
Page 34