#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఉండవచ్చు. కాళిదాసు కాలానికే అది అక్కడక్కడ పండితుల విచారంలో ప్రచారంలో రూపు దిద్దుకొని ఉంటుంది. ఆ రూపు బహుశా కాళిదాసు చూపు నాకర్షించి ఉండి ఉంటుంది.

  దీనికొక కారణ మసలు కాళిదాసు సహజంగా శైవ మతావలంబి కావటం. కాళిదాసనే పేరే చెబుతుందాయన కాళి ఉపాసకుడైన శైవుడని. పోతే ఇప్పుడు బహుళ ప్రచారంలో ఉన్న శ్యామలా దండకాదు లాయన రచనలే నని మనం విశ్వసించేట్టయితే ఆయన శైవమతాభినివేశాన్ని మనం కాదన లేము. దీనికి తోడాయన జన్మస్థాన ముజ్జయిని అనుకొంటే అందులో వెలసిన మహా కాలు డాయన ఆరాధ్య దైవమయి ఉండాలి. అదే పనిగా మేఘ సందేశంలో ఆ దేవుని స్మరిస్తాడు కూడా. అంతేకాదు. అతడు రచించిన నాటకాలు మూడింటిలో కూడా నాందీ పద్యాలు శివ శక్తి పరాలే. రఘువంశాదిలో చేసిన వాగర్థావివ అనే స్తోత్రం శివ స్తోత్రమే. కుమార సంభవ కథ అంతా శివైక పరాయణమే. కావ్యాల్లో నాటకాల్లో తరుచు శివ నామస్మరణమే. కడకు శాకుంతలం భరత వాక్యంలో తానాసించిన జీవిత లక్ష్యం సమీక్షించి చూచినా మన కర్ణ మవుతుందాయన శివ భక్తి పారవశ్యం. మమాపిచ క్షపయతు నీల లోహితః - పునర్భవం పరిగత శక్తి రాత్మభూః అని ముక్త కంఠంతో వాపోతాడు. ఆ నీలలోహితు డా ఆదిశక్తితో కూడా తనకు సాక్షాత్కరించి తన్నీ సంసార బంధం నుంచి విముక్తుణ్ణి చేయాలట. ఇంకా లోతుకు దిగి చూచామంటే ఆయన రచన లన్నిటిలో కల్పించిన నాయికా నాయకు లెవరో కారు. శివ శక్తులకు కేవలం ప్రతీకలే నని చెప్పినా చెప్పవచ్చు. ఇది ఉత్తరోత్తరా నేనే విశదీకరించి చెప్పబోతాను. అలమిహ బహు ప్రపంచ నేన. ఇంతకూ కాళిదాసు సహజంగా శైవ మతాభిమాని అని గ్రహిస్తే చాలు.

  అయితే ఆయన గొప్ప ఏమంటే సహజంగా శైవుడే అయినా మన తెలుగు కవి పోతన లాగా ఇంతింతై వటుడింతయై అన్నట్టు బాగా ఎదిగి

Page 33

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు