స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పరమాత్మే. అమూర్తమైన ఆయన మూర్తులే ఇవి. అమూర్త మాయన స్వరూపం. మూర్త మాయన విభూతి. సువర్ణం స్వరూప మనుకొంటే కటక కుండలాద్యాభరణాలు దాని విభూతి. స్వరూప విభూతులకు రెంటికీ భేదం లేదు. ఒకటి వస్తువు. మరొకటి దాని ఆభాస. వస్తువు మనకు కనపడక పోయినా ఆభాస కనపడుతుంది. అలాగే కదా కన పడుతున్నది ప్రస్తుత మీ చరా చర ప్రపంచమూ మనకు ప్రత్యహం. కనపడే ఈ ప్రపంచ సృష్టిని బట్టి ఆ సృష్టి కర్త స్వరూపాన్ని సులభంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇదంతా ఆ స్వరూపమే తద్విలక్షణంగా ఇందులో ఏదీ లేదని అంతా స్వరూప భావనతో చూడటమే అనుభవం. అప్పుడు పరోక్షంగా ఉండిపోయిన స్వరూపం కూడా ఈ విభూతి పర్యాలోచన ద్వారా అపరోక్షంగానే అనుభవానికి రాక మానదు. ఇది యదేవేహ తదముత్ర - యదముత్ర తదన్విహ అనే ఉపనిషద్వాక్యాని కెలా అద్దం పడుతున్నదో చూడండి. దీనిని బట్టి కాళిదాస మహా కవి కున్న పరిపూర్ణాద్వైత దృష్టి మనకు బాగా స్పష్ట మవుతున్నది.
అద్వైత క్షేత్రంలో కూడా కాళిదాసు సాగించిన వ్యవసాయం కొంత దూరం పోయి మరొక క్రొత్త మలుపు తిరిగింది. కేవలాద్వైతమే గాక ఆయన మనసునది శివాద్వైత రూపంగా ఆవేశించింది. శివాద్వైతమనీ శాక్తాద్వైతమనీ శుద్దాద్వైతమనీ దాని కనేక నామధేయాలు ఇది కాశ్మీర దేశంలో అవతరించిన సిద్దాంతం. అద్వైత సిద్ధాంతమే ఇది కూడా. కాని ఇది వైదికం కాక తాంత్రిక మయి కూచుంది. శైవాగమాలు వైదికమైన అద్వైతాన్ని శివాద్వైతంగా మార్చాయి. కాశ్మీర దేశస్థులైన విద్వాంసులు మొదటి నుంచీ శివ దీక్షా పరులు. మహా మేధావులు కావటం మూలాన ఔపనిషదమైన అద్వైత భావాలను కూడా చక్కగా ఆకళించు కోగలిగారు. కాని అంతకు ముందు నుంచీ తమ మనసులలో నాటు కొని ఉన్న శివదృష్టిని వదలలేక పోయారు. తన్మూలంగా అద్వైతంలో బ్రహ్మ తత్త్వానికి మారుగా శివతత్వాన్ని జోడించారు వారు. నామ్ని కో దోషః . బ్రహ్మానికే లక్షణాలు చెప్పారో అవేవారు శివతత్త్వానికి కూడా వర్ణిస్తారు కాబట్టి
Page 29