స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పరమేశ్వరుని సమాధి దీక్ష వర్ణించినా- ఒక జగన్మాత తపశ్చర్య వర్ణించినా . ఆఖరుకు శాకుంతలంలో దుష్యంతుడు స్వర్గసీమకు వెళ్ళితే అక్కడ మరీచాశ్రమంలో ఆ ప్రజాపతి కఠోర తపశ్చర్య వర్ణించినా ఒకే బాణీలో వర్ణిస్తూ పోతాడు. అద్వైత జ్ఞానమెంత ఉన్నా దానికి సాధన తోడు కావాలి - ఆ సాధన యోగ సాధనే నని ఆయన అభిప్రాయం. అంతేగాని అద్వైత దృష్టి లేని వాడని కాదు. దాని పట్ల విముఖత కలవాడనీ కాదు. మీదు మిక్కిలి పరోక్షాపరోక్ష రూపమైన రెండు జ్ఞానాలు పుష్కలంగా ఉన్న మహనీయుడు. ఇంతెందుకు మూడు నాటకాలు వ్రాశాడు కాళిదాసు. మూడింటిలోనూ మొదట్లో నాందీ పద్యాలు మూడు వ్రాశాడు. అవి మూడూ మూడు రత్నాలు. మూడు వజ్రాలు వాటి ప్రకాశ మింతా అంతా కాదు. అనంతం. అసలు నాటక కథకూ వాటి భావాలకూ సంబంధం లేదు. నాందీ పద్యమైనా వస్తు నిర్దేశం చేయాలని వ్రాసిన వాడు కాడాయన. ఆశీ రూపంగా రచించిన వాడు. ఆశీః అంటే ప్రబలమైన కోరిక. కవిగా నాకూ శ్రోతలుగా మీకూ ఇదే జీవితంలో ఉండవలసిన ఏకైక లక్ష్యమని ఆయన వీటి ద్వారా సూచించిన వివక్షితం.
ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బహు ఫలే యస్స్వయం కృత్తి వాసాః కాంతా సమ్మిశ్ర దేహో ప్యవిషయ మనసాం యఃపరస్తాత్ యతీనాం అష్టాభి ర్యస్స్య కృత్స్నం జగదపి తనుభి ర్భిభ్రతో నాభిమానః సన్మార్గాలోక నాయ వ్యపనయతు స వస్తామసీర వృత్తి మీశః
చూడండి. మాళవికాగ్నిమిత్రంలో నాందీ శ్లోక మిది. ఇందులో మొదటి పాదం అర్థం రెండవ పాదం కామం అనే పురుషార్ధాలను చెబుతున్నాయి. అవి రెండూ పనికి రావని వర్ణించటం ద్వారా జగత్తు మీద మమకారం పోగొట్టుకోవాలని అలాగే మూడవ పాదంలో దేహాభిమానం లేదని చెప్పటం ద్వారా జీవ భావమనే అహంకారం పోగొట్టు కోవాలని బోధ పడుతున్నది. అయితే అవి రెండూ పోగోట్టుకోవాలంటే అవిద్యా రూపమైన తమస్సు పనిచేస్తున్నంత వరకూ సాధ్యం కాదు. మరి ఆ తమస్సు పోవాలంటే
Page 27