#


Index


స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  ఇలాటి యోగ దీక్ష రఘు వంశ రాజులకే నేమి. ఆ మాటకు వస్తే సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికే అంటగట్టాడు కవి. మన్మధుడు తన మంది మార్బలంతో స్థాణ్వాశ్రమంలో అడుగు పెట్టాడో లేదో అనతి దూరాన ఒక నిశ్చల సమాధిలో కూచున్న మహా యోగిని దర్శిస్తాడు. ఎలా ఉన్నదా విగ్రహం. దేవదారు వృక్షం క్రింద ఒక వేదిక. ఆ వేదిక మీద పరిచిన ఒక వ్యాఘ్ర చర్మం. దాని మీద వీరాసనం వేసుకొని సర్పజాతంతో జటాజూటం పైకి కట్టుకొని అక్ష మాల రెండు పేటలుగా చెవులకు తగిలించి కృష్ణా జనం మెడకు చుట్టి స్తిమితో గ్ర వీక్షణాలు క్రిందికి పరపి ప్రాణ పంచక సంచార మరికట్టి మనస్సు నీటు నటు కదల కుండా హృదయ కుహరంలో బంధించి నిశ్చల సమాధిలో నిమగ్నమైన విగ్రహమది. అంతే కాదు. కపాల నేత్రాంతర లబ్దమార్గెః జ్యోతిః ప్రరో హై రుదితైః శిరస్తః అని వర్ణిస్తాడు. కపాల రంధ్రం నుంచి కాంతి కిరణాలు పైకి చిమ్ముతున్నాయట. చూడండి. ఇక్కడ వ్యాఘ్రాజినమూ వీరాసనమూ జటాధారణమూ నాసికాగ్ర వీక్షణమూ మనః ప్రాణ నిరోధనమూ కపాల భేదనమూ ఇలాంటి పద ప్రయోగాలే సూచిస్తున్నాయి మనకిదంతా సమాధియోగ సామగ్రియే నని. అసలా మాటకు వస్తే జ్ఞాన పరిభాష వేరు. యోగ పరిభాష వేరు. పరిభాషను బట్టే చెప్పవచ్చు నిది జ్ఞానమా యోగమా అని. కాళిదాసిలాంటి సందర్భాలలో వాడే మాట లేవైనా చూచండి. అవి చాలా వరకు యోగ భాషే గాని జ్ఞాన భాష కాదు.

  ఇలా అన్నాము గదా అని ఆ మహా కవి కసలద్వైత దృష్టి లేదని మరలా అపోహ పడరాదు. అద్వైత జ్ఞాన సంపన్నుడని ముందే పేర్కొన్నాము. ఎంత యోగ శాస్త్రజ్ఞుడో అంత జ్ఞాన శాస్త్రజ్ఞు డాయన. అయితే జ్ఞానమే అనుష్ఠాన మంతకన్నా మరేదీ అక్కర లేదని తృప్తిపడిన వాడు కాడాయన. జ్ఞానం వల్ల ఆసించే ఆ మహా ఫలాన్ని యోగ సమాధి ద్వారా అందుకోవాలనే దృష్టి ఆయనది. ఆ దృష్టితోనే ఒక రఘు వంశ రాజుల జీవితాన్ని వర్ణించినా - ఒక

Page 26

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు