సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
క్వచి చ్చ కృష్ణారగ భూషితే- భస్మాంగ రాగా తను రీశ్వరస్య పశ్యాన వద్యాంగి విభాతి గంగా- భిన్న ప్రవాహా యమునా తరంగైః
అయోధ్యకు పుష్పకంలో మరలి వస్తూ పైనుంచి క్రిందికి చూస్తూ సాక్షాత్తూ రామచంద్ర మూర్తి చేస్తున్న వర్ణన ఇది. ఎలా ఉందాయన దృష్టికా నదీ సంగమం. ఇంద్ర నీలాలూ ముత్యాలూ కలిపి నిర్మించిన ఒక యష్టిలాగా నల్ల కలువలతో చేర్చి కూర్చిన తెల్లని పద్మ మాలిక లాగా ఉందట. అంతే కాదు. మానసానికి బయలు దేరిపోయే తెల్లని రాజహంసలతో నల్లని రంగు గల హంసలు కూడ బారులు దీరి పోతున్నట్టుందట. అంతే కాదు. తెల్లని చంద్రకాంతులు నల్లని చెట్ల నీడలతో కిర్మీరితమై నట్టు కనిపిస్తున్నదట. అంతే కాదు. నల్లని త్రాచులనే నవాభరణాలుగా ధరించి భసితాను లిప్తమైన తెల్లని పరమేశ్వరుని శరీరంలా కూడా ఉందట. అసలు కవి చెప్ప దలచిన భావమిదే. చివరకు బయట పెట్టాడు. వల్లత్రాచు లేవో గావు అమ్మ వారి రూపమే. కుండలినీ శక్తి గదా ఆ మహా కాళి. ఉరగం కాకపోవట మేమిటి. కృష్ణం కాకపోవట మేమిటి. అలాగే భస్మాంగరాగ భూషిత మైన శరీరం పరమ శివునిదే. అది వాచ్యంగానే సెలవిచ్చాడు కవి. అప్పటికి గంగా యమునల నలుపు తెలుపులు వాటివి గావు. శివ శక్తులవే వాటిలో ప్రతిఫలించి కనిపించాయి కవికి. ఇలాటి పరస్పర విలక్షణంగా కనిపించే గుణ సామరస్యమే సృష్టి అంతా కమ్ము కొని ఉంది. అందులో ఒకటి హెచ్చు లేదు ఒకటి తగ్గు లేదు. అన్యూనానతి రక్తం సమస్తమూ. దానినలా దర్శించటమే క్షేమం లోకానికి. అది విశేషరూపమైన అనేకత్వం నుంచి సామాన్య రూపమైన ఏకత్వం వైపు మనలను తీసుకెడుతుంది. ఆ ఏకత్వమే శివశక్తేక్యం. శక్తి వివర్తమైన అనేకత్వం ఏక రూపమైన శివ తత్త్వంలో లీనమై పోవాలి. అందులో ఇక ఐశ్వర్యమూ అనైశ్వర్యమూ అనే ప్రశ్న లేదు. ఏకైశ్వర్యే స్థితోపి ..... యః స్వయం కృత్తివాసాః. రెంటినీ సమ దృష్టితో చూడగలడు. కామ మకామమనే తేడా లేదు. కాంతా సంమిశ్ర దేహోపి..... యతీనాం కాంతతో ఉన్నా ఏకాంతుడే.
Page 246