సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
శారరవుడు మీరేనా లోక వృత్తాంత నిష్ణాతులు ఇలాటి మాట అనవలసింది. మూర్ఛంత్యమీ వికారాః - ప్రాయే ణైశ్వర్య మత్తేషు. ఐశ్వర్య మద మత్తులు గదా రాజులంటే. ఏ పని చేసినా సరిపోతుంది మీకని పరుషంగా మాటాడుతాడు. ఇలాగే తీవ్రమైన పదజాలంతో ఘాటుగా మాట్లాడి చివరకా శకుంతల తమతో ఎక్కడ వస్తుందో నని ఆమెనూ కఠినంగా మందలించి ఆ రెండవ వాడితో కలిసి వెళ్ళి పోతాడు. ఇక్కడ మనం గమనించ వలసిందే మంటే ఆ శిష్యుడికి తెలుసునే గాని రాజుకే మాత్రమూ గుర్తులేదు శకుంతలను పరిణయ మాడినట్టు. శాపగ్రస్తు డాయన. కాబట్టి కణ్వ శిష్యులు తన్ను నానా మాట అంటుంటే అనవసరంగా అంటారేమా అని ఎంతైనా రెచ్చిపో వలసింది. అయినా కులపతి పంపితే వచ్చిన శిష్యులు వారు. ఆశ్రమవాసులు. తపస్స్వులు. వారు తొందర పడ్డా తాను పడటం భావ్యం కాదని మర్యాద పాటిస్తాడు. అది ఆయన గొప్పతనం. పోతే తమకు తెలియక పోవచ్చు గాక అతని శాప వృత్తాంతం. అయినా తపో ధనులు గదా తాము. ఎందుకా ఇలా ఉదాసీనంగా ఉన్నాడీ రాజని పరామర్శ చేయ వచ్చు గదా. అలా చేయక పోగా ఎలా పడితే అలా అధిక్షేపించటం చాలా అర్భకంగా కనిపిస్తుంది మనకు. చూడండి. తరువాత ఆశ్రమానికి వెళ్ళి చెప్పి ఉంటారు గదా గురువుగారికి జరిగిన దంతా. ఆయనా ఆలకించి ఉంటాడు గదా. వీరిలాగా ఎందుకు తొందర పడ లేదాయన. తెలుసు నాయనకు ఇలా జరుగుతుందని జరిగిందని. అందులో మహారాజు తప్పేమీ లేదని. పిల్ల కాకులకు వీళ్ళకే తెలియదు వెనుకా ముందు. ఏక దేశ నియంత్రితమైన దృష్టి ఇదే. ఇది పూర్వా పరాలను అను సంధానం చేసుకో నీయదు మానవుణ్ణి. లేడికి లేచిందే పరుగన్న ట్టుంటుంది వారి వ్యవహారం. తమ ఆలోచనే సరియైనది - తమ మాటే విలువైన దని వారి దురాగ్రహం. మంచి వారే కావచ్చు. విద్యా వంతులే కావచ్చు. కాని వివేక వంతులు కారు. వినయ వంతు లంతకన్నా కారు. రఘువంశంలో రఘు మహారాజు వద్దకు వచ్చిన కౌత్సుడనే ముని కుమారుడు కూడా ఇంతే. అతడు అన్ని విద్యలలో ఆరి తేరిన వాడే. లోకజ్ఞతలో మాత్రం కాదు.
Page 241