సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
చూపినప్పుడే అవి వచ్చి మెడకు చుట్టుకొనేది. ఆ మొగ్గు చూపటం ఒకటి ప్రియ మొకటి అప్రియమని విశేష దృష్టితో దర్శించినపుడే. అది లేనపు డేదీ లేదు. అంతా మనదే. ఏదీ మనది కాదు. మనమే నని చూస్తే మనదనే దేముందిక. మనదైనా మనది కాదన్నా రెండూ మనలోనే చేరిపోతాయి. సర్వాత్మ భావమంటే ఇదే.
ఇది మహర్షులకు తప్ప మరెవరికీ లేదు. ఆఖరుకు మహర్షి శుశ్రూషలో జీవిత యాత్ర గడుపుతూ వచ్చిన వారి శిష్య పరమాణువులకే కరవైనది. కణ్వుడి శిష్యులు ఒకడు శారద్వతుడు మరొకడు శార్జరవుడు. ఇద్దరూ ఇద్దరే. గడుగ్గాయులు. కణ్వుడి దగ్గర వేద వేదాంగా లభ్య సించారేమో గాని ఆయన సంస్కారమూ వివేకమూ వీరికబ్బలేదు. శకుంతల నొంటరిగా పంపటం సముదాచారం కాదని వీరిని తోడిచ్చి పంపాడా మహర్షి. అలాంటి గురువు గారికే సముదాచారం నేర్పుతాడా శారరవుడు. శారంలాగా రవం చేసే వాడు కాబోలు. బాగా వెదకి పెట్టాడా పేరు కాళిదాసు. ఓదకాంతం స్నిగ్ధ జనోను గంతవ్య ఇతి శ్రూయతే అని ఆ యన సమక్షంలో తన పాండిత్యం ఒలక బోస్తాడు. ఆ మాత్రం తెలియదా మహర్షికి. వనౌకసోపి సంతో లోకజ్ఞా వయమని చాటిన వాడాయన. పోతే ఇక రాజుగారి నగరానికి వెళ్ళారో లేదో అక్కడికి వెళ్ళినప్పటి నుంచీ ఆపసోపాలే శిష్యు లిద్దరికీ. ఒకడు జనాకీర్ణమైన ఈ నగరం హుతవహ పరీతమైన గృహంలా ఉందంటే ఇంకొకడు అభ్యక్త మీవ స్నాతః శుభ్రంగా స్నానం చేసి వచ్చిన వాడికి తలంటుకొన్న వాణ్ణి చూస్తున్నట్టు - ప్రబుద్ధ ఇవ సుప్తం నిద్ర పోయే వాణ్ణి మేలు కొన్న వాడు చూస్తున్నట్టు - బద్దమివ స్వైరగతిః స్వేచ్ఛగా తిరిగే వాడు ఒక చోట కట్టు బడ్డ వాణ్ణి చూస్తున్నట్టు - భోగ లాలసులైన ఈ నగర వాసులను చూస్తుంటే నాకు తోస్తున్న దంటాడు. తీరా లోపలికి వెళ్ళి రాజు గారితో సంభాషణ కుపక్రమించారో లేదో ఇక మొద లయింది వారి దూకుడు. ఆయన ఏమిటి మీరు చెబుతున్న మాట అన్నాడో లేదో అప్పుడే అందుకొన్నాడు
Page 240