సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆలజాలంగా ఉంటే నా ఊసు నీవు స్మరించ వంటాడు. భర్రా తదర్పిత కుటుంబ భరేణ సార్ధం శాంతే కరిష్యసి పదం పునరాశ్రమేస్మిన్. కుమారుడికి రాజ్య భార మప్పగించి నీ నాథునితో కలిసి నీవు మరలా ఆశ్రమంలో అడుగు పెడతావని దీవిస్తాడు. ఏ నోట అన్నాడో ఆ మాట అలాగే ఫలించింది. కణ్వాశ్రమంలో కాకున్నా కశ్యపాశ్రమంలో కలుసుకొన్నారా లేదా చివరకా కుటుంబ సభ్యులంతా. అక్కడ కణ్వుని ప్రశంస వచ్చిందా లేదా. ఇదీ విషయం.
ఇలాగే కశ్యప మహర్షిది కూడా సామాన్య దృష్టి. కణ్వు ఉత్తవారింటికి పంపి అప్పు తీర్చిన వాడిలాగా ఆవిడ ఊసిక పట్టించుకోలేదు. దుష్యంతుడు చూతామా దుర్వాసుడి శాపం పని చేసి అసలావిడ ఎదుట నిలుచోటం కూడా సహించలేక పోయాడు. వెంటవచ్చిన కణ్వ శిష్యులా మహా ఘటికులు ఆవిడ వెనక్కు తిరిగి చూచినా మండిపడి తమతో రావటాని కసలే సమ్మతించలేదు. ఏదో కొంత అభిమానంతో రాజ పురోహితు డావిడను తన ఇంట్లో పెట్టుకోటానికి సుముఖంగా ఉన్నా అంతకన్నా ఆ పరిస్థితిలో తల్లే ఆదుకోటం మంచిదని సహజమైన మాతృ వాత్సల్యంతో మేనక ఆవిడను స్వర్గసీమ కెత్తుకుపోయి అక్కడ సకల దేవతలకూ పూజాపాత్రుడైన కశ్యప మహర్షి ఆశ్రమాన్నే చేర్చింది తన బిడ్డను. ఇంత మంది చేత పరిత్యక్త అయిన ఒక అభాగ్యురాలిని ఎంతో ప్రేమతో ఆదుకోన్నాడంటే ఆ మహర్షి ఎంత విశాల హృదయుడు. ఎంత కరుణాళుడు. కారణం. వారందరిదీ పాక్షికమైన దృష్టి అయితే సర్వ ప్రాణి సాధారణమైన నిష్పాక్షిక దృష్టి ఆయనది. పూర్వావపరాలు రెండూ ఆకళించుకొని మధ్యలో జరిగిన పరిస్థితిని వాటితో ముడి పెట్టి చూచి అర్ధంచేసుకోగల మహనీయులు గనుకనే అటు కణ్వుడు గాని ఇటు కశ్యపుడు గాని తొందర పడలేదు. ఈసడించలేదు. త్రోసి పుచ్చలేదు. అంతా దైవలీల అని ఆ ఈశ్వర సంకల్పాని కనుగుణంగా ప్రవర్తించ సాగారు. ఇలాటి సమరస భావ మున్నప్పుడు రాగ ద్వేషాలకు తావు లేదు. అటూ ఇటూ మొగ్గు
Page 239