#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

వస్తూ తనలో తాను అనుకొన్న మాట వినండి. ఎంత నిర్లిప్తుడో తెలుపుతుందా మహర్షిని, అర్థోహి కన్యా పరకీయ ఏవ - తామద్య సంప్రేష్య పరిగ్రహీతుః - జాతో మమాయం విశదః ప్రకామం- ప్రత్యర్పిత న్యాస ఇవాంత రాత్మా. ఎంత గొప్ప మాట ఇది. కన్య అనేది ఒక ధనం. అది మనది కాదు. పరులది. మన దగ్గర కేవలం న్యాస మున్నది. మరలా దాన్ని సకాలంలో వారి కంద జేస్తే ఎలా ఉంటుంది మనసుకు. అలాగే ఉంది శకుంతల నిప్పు డత్త వారింటికి పంపితే ఆ మహర్షికి. ఇల్లడ పెట్టిన సొమ్ము హక్కుదారు కప్పగిస్తే ఎలా తేలిక పడుతుందో అలా తేలిక పడిందాయన మనసు. ఎంత గొప్ప నిర్లిప్తతో చూడండి ఆ మహర్షిది. ఇదే సామాన్య దృష్టి అంటే. విశేష దృష్టి ఉన్నవాడి కిది అబ్బదు. అందుకే నేమో దుష్యంతుడికి సందేశం పంపుతూ సామాన్య ప్రతిపత్తి పూర్వక మియం దారేషు దృశ్యా త్వయా. నీవీ కన్యను మాకన్య గదా అని సవిశేషంగా చూడ నక్కరలేదు. నిర్విశేషంగా సర్వసామాన్యంగా చూస్తే చాలు నంటాడు. తన దృష్టి అలాంటిది గనుకనే ఆ మాట అన గలిగాడాయన. ఈ సామాన్య దృష్టి సంపన్నుడు గనుకనే ఒక్క సారి శకుంతల నత్త వారింటికి పంపాడో లేదో ఇక ఆవిడను మరలా స్మరించ లేదాయన. ఆవిడ అక్కడ ఏ బాధలు పడిందో తెలియదా అంటే తెలియని వాడు కాదు మరలా. తెలుసు నంన్నందుకు నిదర్శనం సప్తమాంకంలో కశ్యపుని మాటలలో మనకు తెలిసిపోతుంది. శకుంతలా దుష్యంతులు కలుసుకొన్న ఈ శుభవార్త కణ్వ మహర్షి కంద జేయాలని ఒక శిష్యుడంటే - అక్కర లేదాయన ఈ పాటికే తపో బలంతో అన్నీ గ్రహించి ఉంటాడు. అయినా లోక ధర్మంగా అంద జేస్తే చేయవచ్చు నంటా డాయన. దీన్ని బట్టి మొదట కూడా శకుంతలా వ్యవహార మాయనకు తెలిసే ఉంటుంది. అయితే దానితో పాటు దుర్వాసుని శాపమూ - తన్నిమిత్తమైన దుష్యంతుని విస్మరణమూ అదీ తెలుసును కాబట్టి అంతా దైవికమని చెప్పి ఊరకున్నాడు. అంతే కాదు. శకుంతల ఎప్పుడు నాన్నా మరలా నిన్ను చూడగలిగేదని అడిగితే నీవూ నీ భర్తా పుత్రుడూ అందరూ కలుసుకొని

Page 238

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు