సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పాత్రల లాంటివవి. అయితే చిత్రమేమంటే సామాన్యంలో విశేషాలు లయ మవుతున్నా సామాన్య దృష్టి లేనంత వరకూ లయ మవుతున్నట్టు తెలియదు. విశేషాలే గోచరిస్తుంటాయి. అది తెలిసి చూస్తున్నప్పుడే నిజమైన లయం. అప్పటికి విశేషాలన్నీ సామాన్యరూపంగానే భాసిస్తాయి కాబట్టి వాటి ఒత్తిడి మనసు మీద పడదు. సామాన్యమే గదా అనే ప్రతి సంధానం దాన్ని తేలిక పరుస్తుంది. ఇదీ ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. దీన్ని ఎంతగా పట్టించుకోవాలో అంతగా ఒంట పట్టించు కొన్న వారు మహర్షులు. అలా పట్టించు కొంటేనే అసలు మహర్షి. కణ్వ కశ్యపుల దలాంటి ఉదాత్త విశాల దృష్టి, కనుకనే కణ్వుడు తన పరోక్షంలో తన సమ్మతి లేకుండా జరిగిన శకుంతలా దుష్యంతుల వ్యవహారాన్ని తాను అగ్ని ముఖంగా విని మనసులో అణు మాత్రం కూడా ఆందోళన చెందలేదు. ఆగ్రహించి వారిని మందలించ లేదు. తొందర పడి నిష్ఠురంకూడా ఆడ లేదు. మౌనంగా ఉండిపోయాడు. పైగా శకుంతల సిగ్గు పడుతూ తన ఎదుట నిలుచుంటే ఎందుకమ్మా కంట తడి పెడతావు నీవేమి తప్పుచేశావని దిష్ట్యా ధూమాకుల దృష్టిరపి యజమానస్య పావక ఏవాహుతిః పతితా సుశిష్య పరిదత్తా విద్యేవ అశోచనీయా సంవృత్తి - అద్యైవ ఋషి రక్షితాం త్వాం భర్తు స్సకాశం విసర్జయామి - అని సాంత్వన వచనాలు పలుకుతాడు. ఒకానొక వ్యామోహంతో కళ్ళు మూసుకు పోయి ఆవిడ ఆ పని చేసినా కళ్ళలో పొగ చేరి యజమానుడు హోమంచేస్తే అది సరిగా పోయి అగ్నిహోత్రంలోనే పడ్డట్టుందట. చేసిన ఉద్దేశం మంచిది కాకున్నా దాని ఫలితం చివరకు మంచిదే నని భావం. అంతే కాదు. అర్హుడైన శిష్యుడికి చక్కని విద్య నప్పగించి నట్టయిందట. అంచేత బాధ పడవలసిందేమీ లేదంటాడు. విద్య ఎవరిక్కడ. శకుంతల. దాని నందుకొనే అర్హత గల శిష్యుడెవడు. దుష్యంతుడు. ఇక బాధ దేనికి. గురు వప్పగించ కుండానే శిష్యుడు పరిగ్రహించా డనే కొరతా. అది కూడా లేదంటా డాయన. అంచేత భర్త దగ్గరికి పంపట మొక్కటే తరవాయిగా భావించాడా మహర్షి. పంపుతాడు వెంటనే. పంపిన తరువాత వెనక్కు మరలి ఆశ్రమానికి
Page 237