#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  ఇంకొక బాణీ ఏమంటే ఎవరెవరు ఏకదేశ మైన దృష్టితో ప్రవర్తిస్తారో వారి నీశ్వరుడే మౌనంగా శిక్షించి సరియైన మార్గంలో వారిని ప్రవేశ పెట్టినట్టు వర్ణిస్తాడు. సృష్టిలో ఏది జరిగినా అది తన కోసమే నని భావించటం మానవుడి కలవాటు. కామీ స్వతం పశ్యతి. ఒకటి కావాలని కోరినవా డది తనకే దక్కాలి మరెవరికీ చెంద కూడదనే చూస్తాడు. అంతే గాదు. సర్వః కాంత మాత్మానమ్ పశ్యతి. ప్రతి వాడూ తన్నుతాను గొప్పగా భావిస్తాడు కూడా. ఇవి దుష్యంతుడి నోట వచ్చిన మాటలు. శకుంతలను చూచి నప్పటి నుంచీ ఆవిడ నెలా పొందాలా అనే ఆరాట మాయనకు. అది ఆశ్రమమే గానీ ఆశ్రమాధిపతి కణ్వ మహర్షి అక్కడ లేకనే పోనీ. పోందాలావిడ నెలాగైనా, ఏమి. తొందరేమి. కణ్వు డెలాగూ ఆవిడ నాయనకే ఇవ్వాలను కొన్నాడు గదా. అనసూయా ప్రియంవదలకు తెలిసిన మాత్రమా మహారాజుకు తెలియదా. తెలిసినా తెలియకున్నా ఒకరి అభిప్రాయ మేమిటో కడకు తాను కోరిన ఆ కన్య అభిప్రాయ మేమిటో కూడా తన కక్కర లేదు. తన దృష్టి దృష్టి. అది నెరవేరటమే తనకు కావలసినది. అలాగే ప్రవర్తించాడు. హడావుడిగా తన కోరిక తీర్చుకొన్నాడు. అన్ని హామీ లిచ్చా డావిడకు. చివర కేమయింది. శాపం నెత్తికి తెచ్చుకొన్నాడు. తాను స్వకీయగా భావించిన దాన్నే మరచి పోయాడు. ఈశ్వర శక్తి దుర్వాసుడిలో చేరి అతణ్ణి శపించింది. అలాగే తండ్రి అనుమతి లేకుండా అతనితో సురత వ్యాపారం సాగించి నందుకు దుష్యంతుడి విస్మృతిలో చేరి ఈశ్వర శక్తి శకుంతలను దూరంగా పారదోలి శిక్షించింది. ఇద్దరూ పాక్షికమైన స్వార్ధ బుద్ధితో ప్రవర్తించి నందు మూలాన్నే అలాటి శిక్షకు పాత్రు లయ్యారు.

  పోతే కణ్వ కశ్యపు లిలాటి పాక్షిక దృష్టి కలవారు కారు. వారిది సామాన్య దృష్టి, బృహదారణ్యకంలో చెప్పిన మహా సామాన్య దృష్టి, మహా సామాన్యంలో నుంచే విశేషాలన్నీ ఆవిర్భవిస్తాయి. అందులోనే మెలగుతుంటాయి. మరలా అందులోనే లయ మవుతాయి. ఒక మృత్తికలో నుంచి వచ్చిన ఘట శరావాది

Page 236

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు