సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
రాజు. పోతే ఆయన మనో వేదన పూర్తిగా తొలగి పోయే దెలాగా. ఆలోచించాడు మహాకవి దానికొక ఉపాయం. భిషజా మసాధ్యం. రాజవైద్యులకు కూడా దుర్భేద్యమైన ఆ వ్యాధి కా రాజు గంగా సరయూ సంగమంలో శరీర త్యాగం చేసి ఒక దివ్యమైన శరీరంతో స్వర్గంలో ప్రవేశించి లీలా గారే ష్వరమత పున ర్నందనా భ్యంతరేషు. నందన వనంలో దేవతలు నిర్మించిన క్రీడా మందిరాల్లో అహోరాత్రాలూ ఆ ఇందు మతితోనే మరలా విహరించాడట. అలా చేశాడని వర్ణించేవరకూ నిద్ర పట్టలేదు కాళిదాసుకు. మరి ఆ రఘువంశంలోనే సీతా రాముల పూర్వ జీవితమంతా అంత ఒడుదుడుకులుగా నడచినా తిరుగు ప్రయాణంలో ఆకాశమార్గంలో పుష్పక విమానంలో వారు సాకేతానికి తరలి రావటమూ వారి పట్టాభిషేకమూ కవి వర్ణిస్తుంటే మన మనసులెంతో తేలిక పడ్డట్టు కనిపిస్తుంది. దుష్యంతుడు శాకుంతలంలో శాప గ్రస్తుడైన దానికంటే అంగుళీయక దర్శనంతో అనుభవించిన వేదన అంతా ఇంతా గాదు. ఆ హృదయ భార మాయన మరలా స్వర్గ సీమకు మాతలితో కలిసి పయనించటమూ అక్కడ మరీచా శ్రమంలో క్రమంగా భరతునీ తద్వారా శకుంతలనూ గుర్తించటమూ - కశ్యప దర్శనం చేసుకోవటమూ - ఈ ఘట్టాలను కవి వర్ణిస్తుంటే సడలిపోయి తేలిక పడక మానదు. ఇక విక్రమోర్వశీయంలో నైతే ఊర్వశీ వియోగంతో ఎంతగా పలవించాడో పురూరవుడు. ఎంతగా వర్ణించాడో ఆ విలాపాన్ని మహా కవి. దానితో బరువెక్కింది ఆ రాజు హృదయమే కాదు. మన హృదయాలు కూడా. వీటి కూరట ఇవ్వటానికా అన్నట్టు దేవేంద్రుడి అనుమతితో మరలా ఆ ఊర్వశి వచ్చి రాజును ఆశ్రయించిందని చెబితేగాని అసలు కాళిదాసుకు ఊరట లేదు. ఇలా ఒక భావ తీవ్రత ఎంత పైకి పోతుందో మరలా దాన్ని అంత క్రిందికి దించి చూపుతాడు కాళిదాసు. వేడినీళ్ళకు చల్ల నీళ్ళన్నట్టు రెండింటినీ పాట్లు చేసి రెంటికీ ఒక సామరస్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఒక బాణీ.
Page 235